కమల దళంలో.. కుమ్ములాటలు.. క్యాడర్ బజార్ !!

Publish Date:Jul 21, 2025

Advertisement

 

భారతీయ జనతా పార్టీ  (బీజేపీ) లో ఏమి జరుగుతోంది ? రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ బీజేపీలో ఏదో జరుగుతోంది,అనేది ఇప్పడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సంస్థాగత వ్యవహరాల్లో పార్టీకి, పార్టీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్)కు మధ్య ఒక పెద్ద అగాధమే ఏర్పడిందనేది, ప్రముఖగ్మ వినవస్తోంది. 

సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి, బీజేపీ, ఆర్ఎస్ఎస్’ అధినాయకుల మధ్య విభేదాల  కారణంగానే, పార్టీ జాతీయ అధ్యక్షుని ఎంపిక ఎంతకీ ముడి పడడం లేదని ఇటు బీజేపీ ముఖ్యనాయకులు, సంఘ్ పరివార్ సంస్థల కీలక నేతలు, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంగీకరిస్తున్నారు. అదలా ఉంటే, మరో వంక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ముఖ్య నేతల మధ్య ఎంతో కాలంగా ఎంతో కొంత గుంభనంగా సాగుతున్న అంతర్గత కుమ్ములాటలు, విభేదాలు ఇప్పడు బహిరంగంగా బయటకు తన్ను కొచ్చాయి. 

పతాక స్థాయికి చేరాయి. ముఖ్యంగా, కేంద్ర మంత్రి బండి సంజయ్,మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం,పార్టీని ఒక కుదుపు కుదిపింది. దీంతో, పార్టీ అధ్యక్షునిగా రామచంద్ర రావు ఎంపిక విషయంలో తలెత్తిన విభేదాలు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా వంటి సంఘటనలతో,  అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితిని మరింతగా దిగజారుస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 
నిజానికి, రాజకీయ పార్టీలలో అంతర్గత విభేదాలు కొత్త కాదు. అందుకు బీజేపీ మినహాయింపు కాదు. 

కానీ, క్రమశిక్షణకు మారు పేరుగా ముద్ర వేసుకున్న బీజేపీలో అంతర్గత విభేదాలు చాలా వరకు అంతర్గంగానే ఉంటాయే, కానీ,  బజారుకు ఎక్కడం అంతగా ఉండదు. అందుకే, బండి వర్సెస్ ఈటల మాటాల యుద్ధం మేదో దృష్టిని గట్టిగా ఆకర్షిస్తోంది. అయితే, ప్రస్తుత బీజేపీ నేతలంతా సంఘ్ పరివార్’ సంస్కృతీ నుంచి వచ్చినవారు కాదు. ఈటల విషయాన్నే తీసుకుంటే.

ఆయన వామపక్ష భావజాలం నుంచి వచ్చిన నాయకుడు. అంతే కాకుండా, ఆయన బీజేపీలోకి వచ్చే నాటికే, ఏడు సార్లు ఎమ్మెల్యేగా, కేసీఆర్ మంత్రి వర్గంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ముఖ్యమంత్రి రేసులో ఉన్న నాయకుడు. సో.. సహజంగానే’ ఆయన ఆశించిన అధ్యక్ష పదవి రాకుండా పోవడంతో నిరాశకు గురయ్యారని, దానికి బండి సంజయ్’తో ఉన్న చిరకాల వైరం తోడవడంతో ఈటల భగ్గుమన్నా రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

నిజానికి అధికార కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి, ఈటల వర్సెస్ బండి వార్’కు  పెద్దగా తేడాలేదు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ,రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై, రాజగోపాల రెడ్డి, అది కాంగ్రెస్ పార్టీ విధాలకు విరుద్దమంటూ  తీవ్రంగా తప్పు పట్టారు. నిజానికి, అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక్క కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి మాత్రమే కాదు, అసంతృప్తి ఉడికి పోతున్న నాయకులు ఇంకా ఉంటారు.

 ఇక బీఆర్ఎస్ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. అయితే, ఇతర పార్టీల కథ ఎలా ఉన్నా, బీజేపీలో అంతర్గత విభేదాలు.. మీడియా దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. అందుకే, ఈట ల వర్సెస్ బండి మాటల యుద్ధం రాష్ర్ం రాజకీయాల్లో సంచలనంగా మారిందని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే.  బండి వర్సెస్ ఈటల ‘వార్’ ఎలా ఎండ్’ అవుతుంది? అనేది ఆశక్తికరంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.


 

By
en-us Political News

  
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.