మళ్ళీ నోరు జారిన మణి శంకర్ అయ్యర్

Publish Date:Nov 17, 2015

Advertisement

 

పారిస్ నగరంపై ఐసిస్ ఉగ్రవాదులు దాడి చేసి అనేకమంది ప్రజలను అతి క్రూరంగా హతమార్చినందుకు యావత్ ప్రపంచం కంట కన్నీరు చిందుతుంటే, సీనియర్ కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ మాత్రం “యూరోప్ దేశాలలో నానాటికి పెరుగుతున్న ముస్లిం వ్యతిరేకతను అరికట్టాల్సి ఉంది. అలాగే ఫ్రాన్స్ దేశ ముస్లిం పౌరులకు వారు కూడా మిగిలిన పౌరులతో సమానమనే నమ్మకం కల్పించాలి. అసలు ఉగ్రవాదులు పారిస్ నగరంపై ఎందుకు దాడులు చేసారో అందరూ ఆలోచించాలి,” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు మూటగట్టుకొన్నారు.

 

మళ్ళీ నిన్న పాకిస్తాన్ కి చెందిన ‘దునియా టీవీ’ నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మణి శంకర్ అయ్యర్ ని “భారత్-పాక్ దేశాల మధ్య మళ్ళీ సంబంధాలు మెరుగుపడాలంటే ఏమి చేయవలసి ఉంటుంది?” అని ప్రశ్నించినప్పుడు “అన్నిటి కంటే ముందుగా భారత ప్రధాని నరేంద్ర మోడిని పదవిలో నుండి తప్పించవలసి ఉంటుంది. అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాము. కానీ అందుకోసం మరో నాలుగేళ్ళు వేచి చూడవలసి ఉంటుంది. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న కొందరు మోడీ సాబ్ అధికారంలో ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళగలమని అనుకొంటున్నారు. కానీ నేను అలాగా భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి. అప్పుడే మళ్ళీ ఇరు దేశాల మధ్య చర్చలు మొదలవుతాయి. దీనికి అంతకంటే వేరే పరిష్కార మార్గం లేదు. మోడీ ప్రభుత్వాన్ని మేము అధికారంలో నుండి దించగలము. కానీ పాకిస్తాన్ అంతవరకు ఓపికగా వేచి ఉండాలి,” అని మణి శంకర్ అయ్యర్ జవాబిచ్చారు.

 

మణి శంకర్ అయ్యర్ వంటి పరిణతి చెందిన రాజకీయ నాయకుడు భారత్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్ కి చెందిన ఒక మీడియా ఈవిధంగా మాట్లాడటం చాలా విస్మయం కలిగిస్తోంది. భారత్ తో తాము శాంతినే కోరుకొంటున్నప్పటికీ, భారత్ వైఖరి కారణంగానే శాంతి చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడిందని పాక్ అంతర్జాతీయ వేదికలపై ప్రచారం చేస్తోంది. ఇప్పుడు మణి శంకర్ అయ్యర్ మాట్లాడిన ఈ మాటలు పాక్ వాదనలను బలపరిచేవిగా ఉన్నాయి. భారత్-పాక్ చర్చలకు మోడీయే ప్రధాన అవరోధంగా ఉన్నారని, ఆయనని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని అందుకు పాక్ ప్రభుత్వం కూడా సహకరించాలని మణి శంకర్ అయ్యర్ చెపుతున్నట్లుంది.

 

దేశంలో రాజకీయ పార్టీలు, నేతలు ఒకరితో మరొకరు ఎంతగా అయినా విభేధించుకోవవచ్చును కానీ విదేశాలతో ముఖ్యంగా భారత్ ని శత్రుదేశంగా భావిస్తూ, పరోక్ష యుద్ధం చేస్తున్న పాకిస్తాన్ తో మాట్లాడేటప్పుడు చాలా ఆచి తూచి మాట్లాడవలసి ఉంటుంది. మణి శంకర్ అయ్యర్ ఒక కాంగ్రెస్ నేతగానో లేక ఒక రాజకీయ నాయకుడిగానో కాకుండా ఒక భారతీయుడిలాగ మాట్లాడాలి. కానీ ఆయన తన దేశ ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నట్లున్నారు.

 

మణి శంకర్ అయ్యర్ వివాదాస్పద మాటలపై కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందిస్తూ “మణి శంకర్ అయ్యర్ కి వృద్దాప్యం వలన మతి స్థిమితం కోల్పోయినట్లున్నారు. లేకుంటే ఒక పాకిస్తానీ టీవీ ఛానల్ తో ఆవిధంగా మాట్లాడి ఉండేవారు కాదు. ఆయన మాట్లాడిన మాటలు కేవలం భారత ప్రధాని నరేంద్ర మోడినే కాదు యావత్ దేశ ప్రజలను అవమానిస్తున్నట్లుంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం తక్షణమే స్పందించాలి,” అని అన్నారు. ఆయన మాట్లాడిన ఈ వివాదస్పద మాటలపై బీజేపీతో సహా అనేక పార్టీలు విమర్శలు గుప్పించడం మొదలుపెట్టగానే, తను ఆవిధంగా మాట్లాడలేదని మణి శంకర్ అయ్యర్ బుకాయించారు. ఆయన మాటలను ఖండించకపోగా కాంగ్రెస్ పార్టీ ఆయననే వెనకేసుకు వస్తోంది.

 

ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రెండు మూడు రోజుల క్రితం అన్న మాటలను గుర్తు చేసుకోక తప్పదు. “రాజకీయ నాయకులు ఒక వయసు రాగానే స్వచ్చందంగా రాజకీయాల నుండి తప్పుకొని, సమాజసేవ, మానవసేవ కార్యక్రమాలలో పాల్గొంటే బాగుంటుంది,” అని అన్నారు. మణి శంకర్ అయ్యర్ మాటలు వింటే అది నిజమేననిపిస్తుంది. రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో వృద్ధ నేతల స్థానంలో యువతను తీసుకు రావాలని భావిస్తున్నారు కనుక ఇటువంటి వృద్ద నేతలను అందరినీ పక్కనపెడితేనే కాంగ్రెస్ పార్టీకి కూడా మేలు జరుగుతుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.