బీజేపి... ఎస్పీల్ని 'వర్గీకరించి' పాలించాలనుకుంటోందా? 

Publish Date:Nov 28, 2016

Advertisement

 


దేశ వ్యాప్తంగా బలంగా తయారవుతోన్న బీజేపి తెలుగు రాష్ట్రాల్లో స్వంత బలం పుంజుకోవాలనుకుంటోందా? అందు కోసం కులం కార్డు చూపించబోతోందా? ఆంధ్రాలో టీడీపీతో వుంటూనే దాని ఓటు బ్యాంకు తనవైపు తిప్పుకునే ఆలోచనలో వుందా? జగన్ కు కూడా చెక్ పెట్టే వ్యూహాలు కమలనాథులు పన్నుతున్నారా? ఇలాంటి బోలెడు ప్రశ్నలు తాజాగా జరిగిన ఒక్క పరిణామంతో వస్తున్నాయి! అదే... మంద కృష్ణ మాదిగ నిర్వహించిన ధర్మ యుద్ధం!


ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు, ఇతర ఉప కులాలు చేస్తోన్న పోరాటం కొత్తది కాదు. రెండు దశాబ్దాలుగా నడుస్తూనే వుంది. అయితే, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ అవసరం అయిన ఈ అంశం ఎప్పటికప్పుడు ఎన్నికల ఎజెండాలో భాగమైపోతోంది. అయినా రాష్ట్ర స్థాయిలో దాదాపూ అన్ని పార్టీలు దీన్ని వాడేసుకున్నాయి. తీరా అధికారంలోకి వచ్చాక వర్గీకరణ అటకెక్కించేస్తున్నాయి. అసెంబ్లీ స్థాయిలో కూడా ఎలాంటి ముందుడగూ వేయలేకపోతున్నాయి. ఇందుకు మూల కారణం మాలల్లో ఎదురయ్యే వ్యతిరేకత భయమే. వాళ్ల ఓట్లు కూడా పోకుండా చూసుకునే ప్రయత్నంలోనే వర్గీకరణ డిమాండ్ ఎక్కడ వేసిన గొంగలి అన్నట్లుగా మిగిలిపోతోంది....


ఎస్సీ వర్గీకరణను ఇప్పటి దాకా టచ్ చేయని బీజేపి కూడా ఈసారి రంగంలోకి దిగింది. కేంద్రంలో అధికారంలో వున్నారు కాబట్టి బీజేపి నేతలు మంద కృష్ణ మాదిగకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. దాని ఫలితమే ఎమ్మార్పీఎస్ నిర్వహించిన బహిరంగ సభకి వెంకయ్య నాయుడు చీఫ్ గెస్ట్ గా రావటం. అంతే కాదు, మంద కృష్ణ వెంకయ్యే మా ఆశ అని గట్టి భరోసా కూడా వ్యక్తం చేశారు. దానికి తగ్గట్టే వెంకయ్య నాయుడు కూడా వర్గీకరణ తప్పక జరుగుతుందన్నట్టు ఫీలింగ్ కలిగించారు. ఇదంతా తెరపైన కనిపిస్తున్న వ్యవహారం. కాని, తెర వెనుక బీజేపి పెద్ద స్కెచ్చే వేసిందంటున్నారు విశ్లేషకులు... 


2019 కల్లా ఇటు తెలంగాణ , అటు ఆంధ్రాల్లో బలమైన శక్తిగా ఎదగాలని అమిత్ షా ఆలోచన. తెలంగాణలో అయితే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. బలమైన ప్రతిపక్షం అంటూ ఒక్క పార్టీ కూడా లేదిక్కడ. వున్న కాంగ్రెస్ ధీటుగా టీఆర్ఎస్ ను ఎదుర్కోవటం లేదు. అందుకే, బీజేపి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారే ఆలోచనలో వుంది. టీడీపీ వదిలిన ఖాళీని పూడ్చాలనుకుంటోంది. అందుకు మాదిగల్ని ఆకర్షించటమే చక్కగా వర్కవుట్ అవుతుందని కూడా భావిస్తోంది. తెలంగాణ ఎస్పీల్లో అత్యధికులు మాదిగలు కాబట్టి వారిని వర్గీకరణ బిల్లుతో తన ఓటర్లుగా మార్చుకుంటే బాగా బలపడవచ్చు కూడా.... 


ఆంధ్రాలోనూ ఎస్సీల్లో మాదిగల ఓట్లు కీలకం. అత్యధిక జనాభ వున్నది మాలలే అయినా అక్కడా అనేక మంది వర్గీకరణను కోరుకుంటున్నారు. వాళ్లందర్నీ బీజేపి తనవైపు తిప్పుకుంటే చాలా లాభం చేకూరినట్టే. పైగా ఆంధ్రాలో ఎస్పీ జనాభా పెద్ద ఎత్తున్న క్రైస్తవం ఫాలో అవుతుంటారు. వీళ్లు మామూలుగా అయితే బీజేపిని నమ్మే చాన్సెస్ అస్సలు వుండవు. కాని, ఈ వర్గీకరణ హామీ ద్వారా కమలం వాళ్లని తన ఖాతాలో వేసుకోవచ్చు. అదే జరిగితే జగన్ కు క్రిస్టియన్ ఓటర్లు భారీగా తగ్గే ప్రమాదం వుంది. అలాగే, ప్రస్తుతానికి బీజేపి మిత్రపక్షం అయిన టీడీపికి కూడా ఎంతో కొంత ఎస్సీ ఓట్ల నష్టం తప్పక పోవచ్చు. అంటే, మొత్తం మీద ఆంద్రాలోనూ ఎస్పీల ఓట్లతో బీజేపి బలమైన శక్తిగా మారుతుందన్నమాట... 


వర్గీకరణ కేంద్రం పరిధిలోనిది కావటం, వర్గీకరణకు అనుకూలంగా ఏ మాత్రం చర్యలు తీసుకున్నా మాదిగలు ఓటు బ్యాంకుగా మారే అవకాశం వుండటం, టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ల లాగా మాలల ఓట్లు పోతాయేమో అనే భయం లేకపోవటం బీజేపికి ఈ విషయంలో కలిసి వచ్చే అంశాలు. అందుకే, నోట్ల కటకటతో బహిరంగ సభలు నిర్వహించే పరిస్థితులు లేకున్నా ఎమ్మార్పీఎస్ మీటింగ్ పెట్టడం, వెంకయ్య పాల్గొని హామి ఇవ్వటం జరిగాయంటున్నారు క్రిటిక్స్. ఇందులో నిజం ఎంత వుందోగాని... వర్కవుట్ అయితే బీజేపికి లాభం మాత్రం వుంటుంది... 

     
 

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.