Publish Date:Aug 22, 2025
మద్యం స్కాం నిందితులను పరామర్శించే విషయంలో జగన్ ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం నిందితులను మినహాయిస్తే.. జగన్ ఇతర కేసుల్లో అరెస్టైన తమ పార్టీ నేతలు, కార్యకర్తలను జైలుకెళ్లి పరామర్శించారు. ఆ పరామర్శ యాత్ర సందర్భంగా తెలుగుదేశం కూటమి సర్కార్ పై విమర్శలు గుప్పించి మరీ వచ్చారు. జగన్ జైలుకెళ్లి పరామర్శించిన వారిలో రౌడీ షీటర్లు ఉన్నారు. గంజాయిబ్యాచ్ వాళ్లూ ఉన్నారు.
కానీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన వారిలో తనకు అత్యంత సన్నిహితులు, పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన వారూ ఉన్నా ఎందుకో మరి వారిని పరామర్శించే విషయంలో మాత్రం ఆయన ఇసుమంతైనా ఆసక్తి చూపడంలేదు. ఈ కేసులో అరెస్టైన వారిలో జగన్ మాజీ పీఏ, మాజీ ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్, అలాగే ఈ కుంభకోణంలో కీలక పాత్ర ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేశిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి వంటి వారు ఉన్నారు. వీరంతా జగన్ కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన వారే. అయినా సరే ఇప్పటి వరకూ వారిని జగన్ పరామర్శించలేదు.
కానీ ఎట్టకేలకు ఇక తప్పదన్నట్లుగా ఈ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి పరామర్శకు మాత్రం రెడీ అయినట్లు ప్రకటించారు. ఈ నెల 25న రాజమహేంద్రవరం వచ్చి, జైలుకు వెళ్లి మిథున్ రెడ్డిని జగన్ పరామర్శిస్తారని పార్టీ కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన కూడా పరామర్శ తేదీకి పది రోజుల ముందే వెలువడింది. ఇక పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా జగన్ మిథున్ రెడ్డిని ఈ నెల 25న పరామర్శించనున్నారని మూడు నాలుగు రోజుల ముందు ధృవీకరించారు. అంతలో ఏమైందో ఏమో కానీ ఆ పరామర్శయాత్రను జగన్ వాయిదా వేసుకున్నారు. ఆగస్టు 25న కాదు మరో తేదీన వస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. జగన్ పరామర్శ వినాయకచవిత తరువాత ఎప్పుడో ఉంటుందని అదే బొత్స ప్రకటించారు. జగన్ రాజమండ్రి జైలు యాత్ర మళ్లీ వాయిదాపడిందన్న వార్తలపై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు.
ఇదే మద్యం కుంభకోణం కేసులో నేడు కాకపోతే రేపు.. రేపు కాకపోతే మరో రోజు ఇదే రాజమహేంద్రవరం జైలుకు తాను కూడా రావాల్సి ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇంతోటి దానికి పరామర్శ యాత్ర ఎందుకు? అనే జగన్ మిథున్ రెడ్డి పరామర్శను వాయిదా వేసుకున్నట్లుందంటూ కామెంట్లు పెడుతున్నారు. తన హయాంలో తెలుగుదేశం అధినేత, అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును అక్రమంగా నిర్బంధించిన జైలుకు ఇప్పుడు తన సన్నిహితుడు, తన వల్లే జైలు పాలైన మిథున్ రెడ్డిని పరామర్శించాల్సిన పరిస్థితి రావడం జగన్ కు మింగుడుపడటం లేదనీ, అందుకే తన పర్యటన వాయిదే వేసుకున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-jagan-visit-mithun-reddy-in-rajahmundry-jail-postponed-again-25-204752.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.