తెలుగు రాష్ట్రాలలో ఐటీ సోదాల కలకలం.. వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక అక్రమాల గుట్టు రట్టు.!

Publish Date:Aug 20, 2026

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో విదేశీ చెల్లింపుల పేరుతో సాగిన ఒక భారీ ఆర్థిక  అక్రమాల గుట్టు ఐటీ దాడుల్లో బయటపడింది.  ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆదాయపు పన్ను శాఖ  అధికారులు నిర్వహించిన  సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల  విదేశీ చెల్లింపుల  వ్యవహారంలో పన్ను ఎగవేత, యు అక్రమ నిధుల మళ్లింపు ఆరోపణలపై ఐటీ అధికారులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏకకాలంలో  13 ప్రాంతాలలో సోదాలు చేపట్టారు.  ఈ సోదాల్లో డిజిటల్ ఆధారాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.  హైదరాబాద్‌లో 9చోట్ల, ఏపీలోని విశాఖపట్నంలో 3,  గుంటూరులోని ఒక ప్రాంతంలో   ఐటీ అధికారులు   ఈ సోదాలను నిర్వహించారు.   

సింగపూర్, హాంగ్‌కాంగ్, బ్రిటన్ , చైనా,  ఇండోనేషియా వంటి   దేశాల్లో ఉన్న వివిధ సంస్థలకు విదేశీ సేవలు పొందినట్లు చూపుతూ ఈ వందల కోట్ల నిధులను పంపినట్లు ఐటీ అధికారులు ఈ సోదాలలో గుర్తించారు. అయితే ఆయా దేశాల్లో అసలు సేవలు అందాయా లేక   అక్రమ మార్గాల్లో డబ్బును విదేశాలకు దాటవేయడానికే బోగస్ షెల్ కంపెనీలను సృష్టించారా అన్న విషయంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ మొత్తం నెట్‌వర్క్‌లో విశాఖపట్నం వేదికగా స్టాక్‌పైల్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.  2021లో విశాఖలోని మారీకవలస జంక్షన్ చిరునామాతో ఏర్పాటైన ఈ   కంపెనీ నుంచే  .900 కోట్ల రూపాయల మేర విదేశీ చెల్లింపులు జరిగినట్లు తేలింది.     ఈ కంపెనీ డైరెక్టర్లు దీపక్ , మాధవ రామ్ పొనపల్లి నివాసాలు,  కార్యాలయాలలో జరిగిన సోదాలలో   భారీగా లావాదేవీలు జరగినట్లు గుర్తించారు.

అలాగే..  గుంటూరులోని అరండల్‌పేటకు చెందిన చిన్న వెంకట సుబ్రహ్మణ్యం దామా అనే వ్యక్తికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో జరిపిన తనిఖీల్లో..  130 కోట్ల రూపాయల   అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకు నిధులు మళ్లించే క్రమంలో ప్రాసెసింగ్ కోసం సిఏలు, ఇతర ప్రొఫెషనల్స్ ఇచ్చే ఫారమ్ 15సీబీ  జారీలోనూ భారీగా అక్రమాలు జరిగాయని, నిబంధనలు ఉల్లంఘించి సర్టిఫికెట్లు ఇచ్చారని స్పష్టమైంది. వ్యాపార టర్నోవర్ నామమాత్రంగానే ఉన్నప్పటికీ, కేవలం పేపర్లపై ఉన్న కంపెనీల పేరిట వందల కోట్లు విదేశాలకు ఎలా వెళ్లాయనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.  డొల్ల కంపెనీల ద్వారా నకిలీ బిల్లులు సృష్టించి హవాలా మార్గాల్లో నల్లధనాన్ని విదేశాలకు పంపించడమే లక్ష్యంగా ఈ భారీ నెట్‌వర్క్ పనిచేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.   

IT raids in Telugu states, foreign remittances scam, Visakhapatnam IT raids, Stockpile Softech Solutions, income tax raids Hyderabad, bogus foreign transactions

By
en-us Political News

  
ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి,  రేచర్ల బొగ్గు బ్లాకులను ఎంపిక చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ వేలం ప్రక్రియ ద్వారా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ఈ రెండు  బొగ్గు బ్లాకులను దక్కించుకుంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో తన వాటాను 9.99 శాతానికి పెంచుకోవడానికి ఎల్‌ఐసికి ఆర్బీఐ అనుమతి లభించింది. ఈ వార్తతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు ధర 1% పెరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ డోపింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. కొకైన్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ITIA అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్ కప్ పూల్ డి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ 5 3 తేడాతో సంచలన విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్‌తో చెలరేగి జట్టుకు ఘన విజయాన్ని అందించిన పూర్తి వివరాలు చూడండి.
బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో పీవీ సింధు, ఆయుష్ శెట్టి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. సాత్విక్ చిరాగ్ జోడీకి వాకోవర్ లభించగా, లక్ష్యసేన్ తీవ్ర పోరాటంలో ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ ఫలితాలు, కీలక గణాంకాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
అంతర్జాతీయ చెస్ రంగాన్ని ఏలుతున్న భారత్! ప్రతిష్టాత్మక సింక్‌ఫీల్డ్ కప్‌లో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించి అగ్రస్థానానికి చేరుకున్న ఆర్. ప్రజ్ఞానంద. మరోవైపు ఆసియాన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత అండర్ 11 బాలికల జట్టు బ్రాంజ్ మెడల్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. పూర్తి వివరాలు చదవండి.
నాసా ప్రతిష్టాత్మక స్విఫ్ట్ గామా-రే టెలిస్కోప్ రెస్క్యూ మిషన్ విఫలమైంది. $30 మిలియన్ల వ్యయంతో చేపట్టిన రోబోటిక్ క్రాఫ్ట్ నియంత్ పిలవకపోవడంతో మిషన్‌ను నాసా రద్దు చేసింది. త్వరలోనే భూ వాతావరణంలో మండిపోనున్న స్విఫ్ట్ టెలిస్కోప్ పూర్తి వివరాలు ఇవే!
ఆస్టిన్ నగరంలో టెస్లా రోబోటాక్సీ ప్లాస్టిక్ బొల్లార్డ్స్‌ను ఢీకొట్టిన వైరల్ వీడియో వెనుక ఉన్న పూర్తి వివరాలు, టెస్లా స్వయంప్రతిపత్తి భద్రతా రికార్డులు మరియు సైబర్‌క్యాబ్ ప్రయోగాల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
గుడ్‌లక్ ఇండియా 2:1 బోనస్ షేర్ల ప్రకటన అర్హత సాధించడానికి మార్చి 13 రికార్డు తేదీ కాగా, షేర్లు కొనుగోలు చేయడానికి ఈరోజే ఆఖరి అవకాశం. షేర్ల ధర, డివిడెండ్ ప్రభావం మరియు పూర్తి వివరాలు తెలుసుకోండి.
గాజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ రూ.550 కోట్ల ఐపీఓ వివరాలు. ప్రైస్ బ్యాండ్ రూ.152-160, లాట్ సైజ్ 93 షేర్లు, జీఎమ్‌పీ ట్రెండ్ మరియు బిడ్డింగ్ సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, హిటాచీ ఎనర్జీ సహా 38 కంపెనీలు ఆకర్షణీయమైన డివిడెండ్లను ప్రకటించాయి. డివిడెండ్ ప్రయోజనం పొందడానికి కొనుగోలు చేయడానికి ఈరోజే చివరి అవకాశం. పూర్తి వివరాలు మరియు రికార్డు తేదీల సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
వస్తుండగా, దుబ్బాక మండలం అప్పన్నపల్లి శివారులో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్ళింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అర్ధరాత్రి వేళ సహాయక చర్యలు ప్రారంభించారు. భారీ క్రేన్ సహాయంతో బావిలో మునిగిపోయిన కారును పైకి వెలికితీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.