అణ్వాయుధ వ్యాపారంలోకి భారత్‌

Publish Date:May 28, 2016

Advertisement

 

1974.... అప్పటికి భారత దేశం ఇంకా అభివృద్ధి వైపు తప్పటడుగులు వేస్తోంది. కానీ అకస్మాత్తుగా అణుబాంబుని పరీక్షించి ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. అణురంగంలో భారత్‌ సామర్థ్యాన్ని చూసిన ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. వెంటనే అణ్వాయుధాలకు అవసరమైన వనరులను పరిమితం చేసేందుకు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అదే ‘న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌’ - NSG. ఏడు దేశాలతో మొదలైన ఈ సంఘం ఇప్పుడు 48 సభ్య దేశాలతో విస్తరించింది. ఈ సంఘంలో సభ్యత్వం ఉన్న దేశాలు పరస్పరం అణ్వాయుధాలకు సంబంధించిన వ్యాపారాన్ని సాగిస్తూ ఉంటాయి. ఇందులో సభ్యత్వం లేని దేశాలకు అణ్వాయుధాలను సరఫరా చేసేందుకు నిరాకరిస్తూ ఉంటాయి. కానీ ఈ దేశాల సహాయసహకారాలు ఏవీ లేకుండానే మన దేశం అణ్వస్త్ర పరీక్షలలో దూసుకుపోయింది. 1998లో పోఖ్రాన్‌లో మరోమారు అణుపరీక్షలను నిర్వహించి తన సత్తాను చాటుకుంది. ఇక భారతదేశాన్ని నిలువరించడం సాధ్యం కాదని NSGకి తేలిపోయింది. కాబట్టి ఒకప్పుడు మన దేశానికి వ్యతిరేకంగా రూపొందిన అదే సంఘం ఇప్పుడు భారత్‌ను తనలో చేర్చుకునేందుకు సిద్ధపడుతోంది. దీనికి అమెరికా, రష్యా వంటి అగ్ర రాజ్యాల మద్దతు ఎలాగూ ఉంది.

 

మొన్నటి వరకూ ఈ విషయం మీద చిటపటలాడుతూ వచ్చిన చైనా కూడా ఇప్పుడు మెత్తబడే పరిస్థితి కనిపిస్తోంది. ఇక భారత్‌ కనుక NSGలో సభ్యత్వాన్ని పొందితే ఆయుధపోటీ పెరిగిపోతుందన్న పాకిస్తాన్ వాదనను కూడా అమెరికా కొట్టిపారేసింది. భారత్‌ను చేర్చుకుంటోంది ఆయుధపోటీ కోసం కాదనీ, అణుశక్తిని శాంతియుతమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం కోసమే అంటూ భారత్‌ను వెనకేసుకు వచ్చింది. అమెరికా చెబుతున్నదానిలో కొంత నిజం లేకపోలేదు. అణుధార్మికత ఉన్న పదార్థాలతో ఆయుధాలే కాదు, అణువిద్యుత్తుని కూడా ఉత్పత్త చేసుకోవచ్చు. అయితే అమెరికా ఈ విషయంలో భారత్‌ను వెనకేసుకురావడానికి ఆ ‘శాంతియుతమైన’ ప్రయోజనాలే కారణం కాదు! భారత్‌ శక్తివంతమైన ఆయుధ కొనుగోలుదారునిగా మారడంతో, మన దేశంతో ఆయుధవ్యాపారాన్ని కొనసాగించేందుకే అమెరికా ఈ వ్యవహారంలో మనకు మద్దతిస్తోంది. పైగా NSGలో సభ్యత్వం ఉన్న దేశాలు మిగతా సభ్య దేశాలకు తమ అణు సంపత్తి గురించి ఎప్పటికప్పుడు జవాబుదారీగా ఉండాలి. కాబట్టి అణురంగంలో దూసుకుపోతున్న భారత్‌ మీద ఒక కన్ను వేసేందుకు కూడా ఈ సభ్యత్వం ఉపయోగపడుతుంది. అంతేకాదు! మున్ముందు మన దేశం నుంచి అణ్వస్త్రాలకు, అణువిద్యుత్తుకు అవసరమైన ముడిసరుకును దిగుమతి చేసుకునే అవకాశం చిక్కుతుంది. అమెరికా ఇంత ముందుచూపుతో ఆలోచిస్తోంది కాబట్టే.. పాకిస్తాన్‌ చేస్తున్న వాదనలను సైతం లెక్కచేయకుండా భారత్‌ను NSGలోకి ఆహ్వానిస్తోంది.

By
en-us Political News

  
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.