Publish Date:Nov 14, 2013
దేవుళ్ళకి కూడా ప్రాంతీయ మసిని పూయడానికి విభజనవాదులు ప్రయత్నిస్తున్నారు. విభజనవాదులకు హైదరాబాద్ని తేరగా ఇచ్చేయాలి.. గతంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఖమ్మం జిల్లాలో కలిపిన భద్రాచలాన్ని కూడా ఇచ్చేయాలి. ఇదెక్కడి న్యాయం? 1956కి ముందు తెలంగాణ ఎలా వుండేదో ఆ తెలంగాణ కావాలని అంటున్నారు కదా, మరి 1956లో భద్రాచలం సీమాంధ్రలోనే వుంది కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే విభజనవాదులు గయ్యిమని అంతెత్తున లేస్తున్నారు.
భద్రాచలంతో తెలంగాణ ప్రజలకు బోలెడంత అనుబంధం పెరిగిపోయిందట. అందుకే భద్రాచలం తెలంగాణలో వుండాలట. మరి సీమాంధ్రులకు కూడా హైదరాబాద్తో అనుబంధం పెరిగిపోయింది కాబట్టి హైదరాబాద్ మీద సీమాంధ్రులకు కూడా హక్కు కావాలంటే దానికిమాత్రం ఒప్పుకోం అంటున్నారు. అంటే ‘అనుబంధం’ అనే పదం మీద కేవలం తెలంగాణ వారికే కాపీరైట్ హక్కులున్నాయా? సీమాంధ్రులకు అనుబంధాలు వుండకూడదా? అసలు భద్రాచలం ఆలయాన్ని హైదరాబాద్ పాలకుల ఆదాయంతోనే కట్టించారు కాబట్టి భద్రాచలం మాదే అని విభజనవాదులు అంటున్నారు. అలాంటప్పుడు భద్రాచలం ఆలయం కట్టించిన సమయంలో సీమాంధ్ర ప్రాంతం కూడా హైదరాబాద్ నవాబుల పాలనలోనే వుండేది కదా.. మరి సీమాంధ్ర మీకు వద్దా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవాళ్ళెవరూ లేరు!
ఈమధ్య మరో కొత్త వాదన విభజన వాదుల నోళ్ళలోంచి ఊడిపడింది. సీమాంధ్ర ప్రాంతంలో అనేక ప్రధాన దేవాలయాలు వున్నాయి. మా తెలంగాణలో లేవు. అంచేత భద్రాచల రాముడినైనా మాకు వదిలిపెట్టండి అంటున్నారు. దేవుళ్ళు ఏ ప్రాంతంలో వున్నా అందరికీ దేవుళ్ళే. ఒకవేళ భద్రాచలం సీమాంధ్రకి వెళ్ళిపోతే తెలంగాణ వాళ్ళు రాముడిని చూడటానికి వెళ్ళరా? రాముడు అందరి వాడు.. ‘అందరి బంధువయా.. భద్రాచల రామయ్యా’ అని అందుకే అన్నారు. అందరి బంధువుని కొందరికే బంధువుని చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. అయినా తెలంగాణలో పెద్ద దేవాలయాలు లేవని అనడం చాలా తప్పు. చాలా గొప్పగొప్ప క్షేత్రాలు తెలంగాణ ప్రాంతంలో వున్నాయి. ప్రాంతీయ భేదం లేకుండా అందరూ వాటిని సందర్శిస్తూనే వున్నారు. విభజనవాదులు మాత్రం ప్రతి అంశాన్నీ విభజనకు ముడిపెడుతూ రాజకీయాలు చేస్తున్నారు. చివరికి దేవుళ్ళకి కూడా ప్రాంతీయ మసిని పూస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-fight-over-bhadrachalam-39-27443.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.