ఫెయిల్డ్ సీఎం జగన్.. హామీల అమల్లో అట్టర్ ఫ్లాఫ్
Publish Date:Apr 28, 2024
Advertisement
ఏపీలో రెండోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో గడిచిన ఐదేళ్ల కాలంలో జగన్ అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెట్టడం.. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని జైళ్లకు పంపించడం వంటి పనులకే జగన్ ప్రాధాన్యతనిచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు హయాంలో ఏపీలో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమయ్యాయి. కానీ, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కంపెనీలను తరిమేసి యువతకు ఉపాధిని దూరం చేశారు. వైసీపీ పాలనలో కనీసం చిన్నపాటి పనులు చేసుకునేందుకు కూడా ఏపీలో అవకాశం లేకపోవటంతో అధికశాతం మంది ప్రజలు పక్క రాష్ట్రాలకు పనులకోసం వసల వెళ్లిన పరిస్థితి. జగన్ ఐదేళ్ల అరాచక పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను గమనించిన జగన్.. పలు హామీలతోపాటు.. సానుభూతి నాటకాలకు తెర లేపారు. వీటిలో బస్సు యాత్ర సమయంలో జగన్పై గులకరాయి దాడి ఘటన ఒకటి. గతంలో కోడి కత్తి డ్రామా, బాబాయ్ హత్యకేసును చంద్రబాబుపై నెట్టడం వంటి విషయాలను గుర్తు చేసుకున్న ప్రజలు జగన్ గులకరాయి డ్రామాను నమ్మలేదు. నవ్వి పోయారు. దీంతో జగన్ నవ్వుల పాలయ్యారు. దాంతో ఆ డ్రామాకు తెరదించేసి, నుదుటిపై బ్యాండ్ ఎయిడ్ ను కూడా తీసేసి మేనిఫెస్టోతో మాయ చేయాలని చేసిన ప్రయత్నమూ బెడిసికొట్టింది. జగన్ మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. గత ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం (ఏప్రిల్ 27) పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టోలో గతంలోని హామీలనే ప్రస్తావించిన జగన్.. పలు పథకాలకు నిధులను పెంచారు. అయితే గతంలో 99శాతం హామీలు అమలు చేశామని జగన్ చెప్పడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. ఏపీలో ఏమాత్రం అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు.. కానీ, జగన్ మాత్రం తన ప్రసంగంలో దాదాపు అన్ని హామీలను అమలు చేశామని చెప్పడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో జగన్ మోహన్ రెడ్డి అట్టర్ ప్లాప్ అయ్యారు. జగన్ రెడ్డి హామీలఅమలు ప్రోగ్రెస్ కార్డు పరిశీలిస్తే.. హామీల అమల్లో జగన్ కు 10శాతం మార్కులు కూడా రాలేదని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరమే లేదు. జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో ఫెయిల్ అయ్యారు. మహిళలు, బీసీలు, రైతులు, ఎస్సీలు, ఆదివాసీలు, మైనార్టీలకు గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో జగన్ సర్కార్ ఏమేరకు అమలు చేసిందన్న విషయంపై ఓ సంస్థ చేసిన క్షేత్ర స్థాయి పరిశీలనలో జగన్ కు 100కు 10 మార్కులు కూడా రాలేదు. గత ఐదేళ్ల పాలనలో మహిళలకు లబ్ధి చేకూర్చడంలో 100 మార్కులకుగాను కేవలం 13 మార్కులే జగన్ ప్రభుత్వానికి వచ్చాయి. బీసీలకు లబ్ధి చేకూర్చే విషయంలో 16 మార్కులు, రైతుల విషయంలో 16 మార్కులు, ఎస్సీలకు లబ్ధిచేకూర్చే విషయంలో 13మార్కులు, ఆదివాసీల విషయంలో 13మార్కులు, మైనార్టీల పథకాల అమలు విషయంలో 10శాతం మార్కులు మాత్రమే జగన్ ప్రభుత్వానికి వచ్చాయి. ఈ ఆరు సబ్జెక్టుల్లో మొత్తం 600 మార్కులకు కేవలం 83 మార్కులు మాత్రమే జగన్ ఐదేళ్ల పాలనకు వచ్చాయి. దీంతో మరోసారి అధికారానికి జగన్ అనర్హులని భావిస్తున్న ప్రజలు.. మే 13న జరిగే పోలింగ్ లో ఓటు ద్వారా గుణపాఠం చెప్పేందుకు రెడీ అయిపోయారు. గత ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీల అమల్లోనూ ఫెయిల్ అయ్యారు. ప్రతి ఇంటికి నవరత్నాల ద్వారా సంవత్సరానికి 1 లక్ష నుంచి 5లక్షల వరకు లబ్ది కలుగుతుందని తప్పు డు ప్రచారాలు చేసింది వైసీపీ పార్టీ. అదేవిధంగా పిల్లలందరికీ అమ్మఒడి అని చెప్పి ఇంట్లో ఒక్కరికే ఇచ్చారు. పేద అక్క చెల్లెమ్మల పేర్లపై సొంత ఇళ్ల రిజిస్ట్రేషన్ అని చెప్పిన జగన్ తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కొ ఇళ్లను కూడా ఇలా మహిళలకు ఇచ్చిన ప్రతి హామీలోనూ జగన్ విఫలమయ్యారు. క్షేత్ర స్థాయిలో ప్రజల అభిప్రాయాల మేరకు ఆయా హామీల అమలు విషయంలో వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన మార్కులను పరిశీలిస్తే.. ప్రతి కుటుంబానికి లబ్ది (ఒక మార్కు), అమ్మఒడి పథకం (ఆరు మార్కులు), పేదలందరికీ ఇళ్లు (2 మార్కులు), మద్యపాన నిషేదం (-2 మార్కులు), డ్వాక్రా గ్రూపులకు ఆసరా విషయంలో (3 మార్కులు), పింఛన్లు (2 మార్కులు), పెళ్లి కానుక (జీరో మార్కులు), అగన్వాడీ వర్కర్లు (ఒక మార్కు). మొత్తం 100 మార్కుల్లో వైసీపీ ప్రభుత్వానికి వచ్చినవి 13మార్కులు మాత్రమే. దీంతో ఐదేళ్లలో మహిళలకు ఇచ్చిన హామీల అమల్లో జగన్ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయిందని స్పష్టమవుతుంది. వైఎస్ జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో బీసీల లబ్ధికోసం ఇచ్చిన హామీల అమల్లోనూ ఫెయిల్ అయ్యారు. ప్రత్యే క ఉప ప్రణాళిక ద్వారా రూ. 75,000 కోట్లు కేటాయిస్తానని చెప్పి.. ఎలాంటి ప్రత్యే క చర్యలు తీసుకోకుండా నిధులు దారి మళ్లించేశారు. ఏ రకంగాకూడా వీటిని సబ్ ప్లాన్ నిధులు అనలేము. బీసీలకు పదవుల విషయంలోనూ ప్రాధాన్యత ఇవ్వలేదు. జగన్ ఐదేళ్ల పాలనలో బీసీ వర్గాలకు జరిగిన మేలును, వారికిచ్చిన హామీల అమలు అంశంలో జగన్ ప్రభుత్వానికి 100కు కేవలం 16మార్కులే ప్రజలు ఇచ్చారు. అదే విధంగా వైసీపీ హయాంలో రైతులు కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. ఐదేళ్ల కాలంలో జగన్ మోహన్ రెడ్డి రైతులకు మేలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. రైతులకు మేలు చేసిన అంశంలో వైసీపీ ప్రభుత్వానికి 100కు కేవలం 16 మార్కులే ప్రజలు ఇచ్చారు. ఏ సమావేశం జరిగినా ఎస్సీలు నా బంధువులు అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి.. ఐదేళ్ల పాలనలో ఎస్సీ వర్గాల ప్రజలను పూర్తిగా విస్మరించారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించక పోవటంతో పాటు.. వారికి కేటాయించిన నిధులు కూడా పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు చేరలేదు. దీంతో ఎస్సీ, ఎస్టీలకు మేలుచేసే విషయంలోనూ జగన్ ఫెయిల్ అయ్యాడు. ఈ విషయంలో జగన్ ప్రభుత్వానికి ఐదేళ్ల కాలంలో ప్రజలు ఇచ్చింది కేవలం 13మార్కులు మాత్రమే. గిరిజనులకు ఇచ్చిన హామీల అమల్లోనూ జగన్ ఫెయిల్ అయ్యాడు. గిరిజనులకు ప్రత్యే క జిల్లా ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయలేదు. 500 మంది జనాభా ఉన్న ప్రతి తండాను, గూడెంను పంచాయితీగా మారుస్తామని ఇచ్చిన హామీని జగన్ అమలు చేయలేదు. ఎస్సీ, ఎస్టీలకు పింఛన్ల అర్హత వయస్సు 45ఏళ్లకి తగ్గింపు అనే హామీని జగన్ అమలు చేయలేదు. దీంతో గిరిజనులకు మేలు చేసే విషయంలో జగన్ ప్రభుత్వంకు ప్రజలు ఇచ్చిన మార్కులు 100కు కేవలం 13 మాత్రమే. మైనార్టీలకు ఇచ్చిన హామీల అమల్లోనూ జగన్ మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. ఐదేళ్ల కాలంలో అరకొర హామీలతోనే సరిపెట్టాడు. 2019 పాదయాత్రలో ఇస్లామిక్ బ్యాంకును ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన జగన్.. మైనారిటీలను మోసం చేశారు. అదేవిధంగా హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చిన జగన్.. ఐదేళ్లలో కేవలం రూ. 14.51 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మసీదులో ఇమామ్ లు, మౌజామ్ లకు గౌరవ వేతనంగా నెలకు రూ. 15,000 ఇస్తామని హామీ ఇచ్చి, కేవలం రూ.10,000 ఇస్తున్నారు. అదే విధంగా ఇమామ్లకు ఇళ్ళ స్థలాలు కేటాయించి, వారికి ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేశాడు. ఇలా ముస్లింకు మేలు చేసే విషయంలోనూ జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ విషయంలో జగన్ ప్రభుత్వానికి ముస్లిం మైనారిటీలు ఇచ్చిన మార్కులు 100కు కేవలం 10 మాత్రమే. మొత్తంగా జగన్ రాష్ట్రంలో ఏ వర్గానికీ మేలు చేయకపోగా, అన్నివర్గాల వారినీ మోసం చేశారు. హామీల అమలు మాట అటుంచి.. పన్నుల రూపంలో వారి నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. ఒక అంచనా ప్రకారం పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు వారి నుంచి వసూలు చేశారు. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టో అంటూ మరోసారి మోసం చేయడానికి జగన్ చేసిన ప్రయత్నాన్ని జనం తిప్పి కొట్టానికి సిద్ధంగా ఉన్నారు.
ఇవ్వలేకపోయారు..
http://www.teluguone.com/news/content/-failed-cm-jagan-39-174684.html