ఇదంతా రాహుల్ గాంధీ బలప్రదర్శన కోసమేనేమో?

Publish Date:Aug 7, 2015

Advertisement

 

లలిత్ మోడీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజే, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజినామాలకి పట్టుబడుతూ పార్లమెంటుని స్తంభింపజేసి కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకొనే ప్రయత్నం చేసింది. నిజానికది రాహుల్ గాంధీ చేసిన బలప్రదర్శనగానే భావించవచ్చును. ఇంతకు మునుపు అతనికి నాయకత్వ లక్షణాలు బొత్తిగా లేవు...స్వంత పార్టీని కూడా ముందుండి నడిపించలేనివాడు...ప్రధాని మోడీ ముందు ఎందుకు పనికిరాడు...వంటి అనేక విమర్శలు ఎదుర్కోవలసి వచ్చేది. ఆ విమర్శలకు ఆయన ధీటుగా జవాబు చెప్పలేక పార్లమెంటు వెనుక బెంచీలలో కునుకు తీసేవారు. కానీ రెండు నెలలు విదేశాలలో చార్జింగ్ చేసుకొని వచ్చిన తరువాత “తనొక బలమయిన నాయకుడు, పార్టీని ముందుండి నడిపించగలను మోడీని కూడా ధీటుగా ఎదుర్కోగలను...”అని నిరూపించే ప్రయత్నంలోనే కాంగ్రెస్ ఎంపీల చేత ఈ బలప్రదర్శన చేయిస్తున్నారని చెప్పవచ్చును. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేసుకోవడానికి పార్టీలో అంతర్గతంగా సీనియర్ల నుండి ఎదురవుతున్న అభ్యంతరాలను అధిగమించడానికి కూడా ఈ హడావుడి పనికి వస్తుందని చెప్పవచ్చును.

 

ఏమయినప్పటికీ అతను ఇప్పుడు అసలు సిసలయిన కాంగ్రెస్ నాయకుడిలాగే వ్యవహరిస్తుండటం చూసి సోనియమ్మ సైతం మురిసిపోతోంది. రెండు నెలలు విదేశాలలో తిరిగి వస్తే ఇంత మార్పు ఎలా సాధ్యమో ఆమెకీ అర్ధం కావడం లేదు కానీ ఆ వెళ్ళేదేదో పదేళ్ళ క్రితమే వెళ్లివచ్చి ఉంటే నేడు ఇటువంటి దుస్థితి వచ్చేది కాదు కదా అని మనసులో అనుకొంటూ ఉండవచ్చును.

 

కాంగ్రెస్ పార్టీ ఊహించినట్లుగానే 25మంది ఎంపీలను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ నుండి 5రోజుల పాటు సస్పెండ్ చేసారు. బహుశః అలాగ జరగాలనే కాంగ్రెస్ సభ్యులు సభను నడవనీయకుండా అడ్డుపడ్డారేమో? ఆ తరువాత వాళ్ళందరూ కలిసి మరో సరికొత్త ఇమ్మోషనల్ డ్రామాకు తెర తీసారు. ఎన్నడూ రోడ్డు మీద నిలబడని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పదేళ్ళ పాటు దేశాన్ని ఏలిన మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ తదితరులు అందరూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిలబడి నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. తమని సభలో నుండి సస్పెండ్ చేసినందుకే వారు ధర్నా చేస్తున్నట్లు చెప్పుకొంటున్నప్పటికీ వారి ఉద్దేశ్యం మాత్రం దేశ ప్రజల సానుభూతిని పొందేందుకేనని చెప్పవచ్చును. పార్లమెంటు సమావేశాలను సజావుగా సాగానిస్తామని హామీ ఇస్తే వారిపై నిషేధం ఎత్తివేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు పదేపదే విజ్ఞప్తి చేసినా వారు తమ ధర్నాని అందుకే కొనసాగిస్తున్నారు.

 

కానీ వెంకయ్య నాయుడు ఆవిధంగా ప్రకటన చేయడం ద్వారా బీజేపీపై కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించినట్లయింది. పార్లమెంటును స్తంభింపజేసి మోడీ ప్రభుత్వానికి తన సత్తా చాటానని రాహుల్ గాంధీ భావిస్తుండవచ్చును. కానీ అతను ఈవిధంగా బలప్రదర్శన చేసేందుకు, ప్రజా సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగకుండా అడ్డుకొన్నందుకు దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని తప్పు పడుతున్నారనే సంగతి గ్రహించడం లేదు. అదే విధంగా వారిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తామన్నా కూడా సభలోకి వెళ్ళకుండా బయట నిలబడి ఇటువంటి డ్రామాలు చేయడం వలన కూడా ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ పట్ల మరింత వ్యతిరేకత పెరుగుతోందనే సంగతి కూడా వారు గుర్తించలేకపొతున్నారు.

 

ఈ డ్రామాలు సరిపోవన్నట్లుగా ఈరోజు యువజన కాంగ్రెస్ వర్కర్ల చేత అర్ధనగ్నంగా నిరసనలు తెలియజేయించడంతో ఇంతవరకు పడిన శ్రమ అంతా వృదా అయినట్లయింది. కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేస్తూ ధర్నా చేస్తున్నప్పుడు వారిపై సానుభూతి చూపినవారు కూడా ఇప్పుడు యువజన కాంగ్రెస్ వర్కర్లు చేసిన అర్ధ నగ్న ప్రదర్శనని చూసి కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసనలు చేయవచ్చు కానీ ఇలాగ పార్లమెంటు ఆవరణలో ఇలాంటి వికృత చేష్టలు చేయడాన్ని అందరూ విమర్శిస్తున్నారు.

 

“ఇదేనా రాహుల్ గాంధీ తన పార్టీకి నేర్పిస్తున్న పద్దతి? ఇదేనా కాంగ్రెస్ సంస్కారం, సంస్కృతి?” అని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కాంగ్రెస్ పార్టీని కడిగిపారేశారు. కాంగ్రెస్ పార్టీ అనుకొన్నది ఒకటి జరిగినది మరొకటి. ఇదంతా నిశితంగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు “కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేస్తానని శపధాలు చేసిన రాహుల్ గాంధీ చివరికి తనే కాంగ్రెస్ పద్ధతులకు అలవాటు పడిపోయినట్లున్నారు”, అని అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.