Publish Date:Jul 14, 2025
లోకేష్ కి పథకాలు తయారు చేయడం రాదా? మరి స్టాన్ ఫర్డ్ లో ఏం నేర్చుకున్నట్టు? అమ్మకు వందనం విషయంలో వైసీపీ చేస్తున్న ప్రచారంలో అర్ధమేంటని చూస్తే.. ఫస్ట్ మనమంతా తెలుసుకోవల్సిన విషయమేంటంటే.. వాలంటీర్ వ్యవస్థ, డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీముల ఆలోచనలు లోకేష్ వే అని ఎందరికి తెలుసు? వీటినే జగన్ కాపీ కొట్టాడన్న సంగతి మీకు తెలుసా?
ఎవరు అవునన్నా కాదన్నా.. లోకేష్ తండ్రి చాటు కొడుకు. ఆయన ఆలోచనలు నేరుగా ఏవీ అమలు కానివ్వని అతి పెద్ద అడ్డంకి తన తండ్రే. తానేదైనా ఒక ప్రతిపాదన చేస్తే.. దాన్ని అలవోకగా మరో స్టైల్లోకి మార్చేస్తారు లోకేష్ తండ్రి చంద్రబాబు. కార్యకర్తలకు జీతాలన్నదే వాలంటీర్లుగా జగన్ మార్చగా.. దాన్ని గతంలో చంద్రబాబు జన్మభూమి కమిటీలుగా మారిన విషయం గుర్తించిన వారు అరుదుగా ఉంటారు. ఇక డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీములు కూడా లోకేష్ తొలుత చేసిన ప్రతిపాదన.
ఇక వైయస్ జగన్ పథక రచన సొంతంగా చేసేది ఏమీ ఉండదు. దీని వెనక అతి పెద్ద క్రిష్టియన్ లాబీ ఉంటుందని సమాచారం. జగన్ పైకి తన బొమ్మలేసుకుని.. ఇష్టారాజ్యం చేస్తుంటారు. కానీ, అదంతా ఒట్టిదే.. ఊరూరా ఉండే పాస్టర్లు.. ఈ పథకాలకు సంబంధించిన సమాచారమిచ్చి.. తగిన సూచనలు చేస్తుంటారు. వీటి ద్వారా జగన్ అయిన దానికీ కాని దానికి, అర్ధం పర్ధం లేని పథకాలు రచించేవారని అంటారు.
అలాగని ఈ కాపీ పేస్ట్ పథకాలు ఆయనకి ఏమంత కలిసొచ్చిన పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున ఎడా పెడా పథకాలిచ్చినా సరే ఆయన గెలవలేక పోయారు. అంటే ఆయన ఈ పథకాలను ఏమంత బాధ్యత కొద్దీ తయారు చేసినవి కావు. ఒక ఆలోచనతో చేసినవి కూడా కావు. అసలు జగన్ పథకాలంటే.. ఖర్చు భారం కింద లెక్క. పైపెచ్చు ఓట్ల కొనుగోలు వ్యవహారంగానూ భావిస్తుంటారు. అందుకే ఆయన గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని అంచనా వేస్తుంటారు నిపుణులు.. నిజానికి ఈ సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్. అప్పటి నుంచే ప్రజారంజక పథకాల శకం ఒకటి మొదలైంది. వాటినే ఆ తర్వాత వైయస్ కాపీ కొట్టారు. ఆ తర్వాత కేసీఆర్ సైతం పేస్ట్ చేసేశారు. ఇక జగన్ సంగతి సరే సరి. తన విస్తృ పథకాల తయారీలో అధిక శాతం.. క్రిష్టియన్ లాబీ నుంచి వచ్చిన సలహా సూచనలకు తన సొంత తయారీలా కలరింగ్ ఇచ్చి.. జనాల్లోకి వదిలేస్తుంటారని అంటారు.
నిజానికి ఒక పథకం అంటే అది ప్రభుత్వానికి భారం కారాదు. పెట్టుబడిగా ఉండాలి. అదెలాగో తెలియాలంటే మనకు చంద్రబాబు నూతన సృష్టి పీ- 4. ఇది నిజంగా ఒక అద్భుతమైన పథకం. ఇదే జగన్ తన హయాంలో అర్ధం పర్ధం లేకుండా చేసిన ఖర్చు ఆయన స్వార్ధానికి సంబంధించిన వ్యవహారం. ఈ మొత్తం పెట్టుబడి కింద పెట్టి మంచి రాజధాని నిర్మాణం చేసి ఉంటే.. అది ఈ పాటికి ఎన్నో పనులను సృష్టించి ఉండేది. ఈ విషయం గుర్తించారు కాబట్టే.. జనం ఆయన్ను తిప్పి కొట్టారు.అలాంటి జగన్ ఆయన పార్టీ లోకేష్ తమ అమ్మ ఒడినే కాపీ కొట్టి అమ్మకు వందనంగా పేరు మార్చారని చెప్పుకోవడం చూస్తుంటే వింతగా ఉందని అంటారు విశ్లేషకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-cm-chandrababu-25-201993.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.