పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో మంత్రి లోకేశ్‌ భేటీ

Publish Date:May 20, 2025

Advertisement

 

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ఉండవల్లిలో ఆయన విద్యార్థులతో ముఖముఖి నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌‌లో విద్యాసంస్కరణలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని లోకేశ్‌ అన్నారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్ల ఉత్తమ విద్యార్థులతో యాడ్స్‌ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కష్టపడి పనిచేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

షైనింగ్‌ స్టార్స్‌ పేరుతో ఉత్తమ విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు.  రానున్న రోజుల్లో ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌ కోసం పట్టుదలతో ముందుకు సాగుతామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లిదండ్రులు తలెత్తుకొని తిరిగేలా చేశారని సంతోషం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం కసి, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నట్టు మంత్రి వెల్లడించారు.

విద్యార్థుల ఆసక్తి తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన డ్రీమ్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేలా ఏర్పాటు చేసిన బ్లాక్స్ ఆకట్టుకున్నాయిని మంత్రి తెలిపారు . జీవితం పట్ల వారికున్న క్లారిటీ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. వారు కంటున్న కలలు అన్ని సాకారం కావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ విద్యా వ్యవస్థ పై నమ్మకం పెరిగేందుకు విద్యార్థులు సాధించిన ఈ ర్యాంకులు ఒక మైలురాయిగా నిలిచిపోతాయిని లోకేశ్ పేర్కొన్నారు

By
en-us Political News

  
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. విమానం కుప్పకూలిపోవడం వెనుక కుట్ర కోణం ఉందా అన్న కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు.
రాజధాని అమరావతిపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనికి సుప్రీం కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో అరెస్టయిన మరో జర్నలిస్టు కృష్ణంరాజుకు బెయిలు అంత వీజీ కాదని అంటున్నారు న్యాయనిపుణులు.
తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూటేంటన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. నిన్నటి వరకూ బీఆర్ఎస్ లో దయ్యాలు చేరాయంటూ, సొంత అన్న టార్గెట్ గా విమర్శలు గుప్పించిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా?
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఆయనకు మరో సారి నోటీసులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సర్కార్ పని తీరు పట్ల జనం సంతృప్తిగానే ఉన్నారు. అయితే ఆల్ ఈజ్ వెల్ అన్న పరిస్థితి మాత్రం కనిపించడం లేదని కూటమి వర్గాలలోనే గట్టిగా చర్చ జరుగుతోంది. కూటమి పార్టీల నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేల పని తీరు పట్ల ఇటీవల సీఎం చంద్రబాబు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.
కడప జిల్లా పాలకొండలు రిజర్వు ఫారెస్ట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడులలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.50 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు.
బాపట్లా జిల్లా చీరాల కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు లభించనుంది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఒడిఒపి)కింద కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
తల్లికి వందనంపై తప్పుడు ప్రచారం చేస్తే వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవు అని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు.
తెలంగాణల్లో స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమవుతుంది. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.