ఏంటీ లోకేష్‌కి.. ప‌థ‌కాలు త‌యారు చేయ‌డం రాదా?

Publish Date:Jul 14, 2025

Advertisement

 

లోకేష్ కి ప‌థ‌కాలు త‌యారు చేయ‌డం రాదా? మ‌రి స్టాన్ ఫ‌ర్డ్ లో ఏం నేర్చుకున్న‌ట్టు? అమ్మ‌కు వంద‌నం విష‌యంలో వైసీపీ చేస్తున్న ప్ర‌చారంలో అర్ధ‌మేంట‌ని చూస్తే.. ఫ‌స్ట్ మ‌న‌మంతా తెలుసుకోవ‌ల్సిన విష‌య‌మేంటంటే.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌, డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీముల ఆలోచ‌న‌లు లోకేష్ వే అని ఎంద‌రికి తెలుసు? వీటినే జ‌గ‌న్ కాపీ కొట్టాడ‌న్న సంగ‌తి మీకు తెలుసా?

ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా.. లోకేష్ తండ్రి చాటు కొడుకు. ఆయ‌న ఆలోచ‌న‌లు నేరుగా ఏవీ అమ‌లు కానివ్వ‌ని అతి పెద్ద అడ్డంకి త‌న తండ్రే. తానేదైనా ఒక ప్ర‌తిపాద‌న చేస్తే.. దాన్ని అల‌వోక‌గా మ‌రో స్టైల్లోకి మార్చేస్తారు లోకేష్ తండ్రి చంద్ర‌బాబు. కార్య‌క‌ర్త‌ల‌కు జీతాల‌న్న‌దే వాలంటీర్లుగా జ‌గ‌న్ మార్చగా.. దాన్ని గ‌తంలో చంద్ర‌బాబు జ‌న్మ‌భూమి క‌మిటీలుగా మారిన విష‌యం గుర్తించిన వారు అరుదుగా ఉంటారు. ఇక డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీములు కూడా లోకేష్ తొలుత చేసిన ప్ర‌తిపాద‌న‌.

ఇక వైయ‌స్ జ‌గ‌న్  ప‌థ‌క ర‌చ‌న సొంతంగా చేసేది ఏమీ ఉండ‌దు. దీని వెన‌క అతి పెద్ద క్రిష్టియ‌న్ లాబీ ఉంటుంద‌ని స‌మాచారం. జ‌గ‌న్ పైకి త‌న‌ బొమ్మ‌లేసుకుని.. ఇష్టారాజ్యం చేస్తుంటారు. కానీ, అదంతా ఒట్టిదే.. ఊరూరా ఉండే పాస్ట‌ర్లు.. ఈ ప‌థ‌కాల‌కు సంబంధించిన స‌మాచార‌మిచ్చి.. త‌గిన సూచ‌న‌లు చేస్తుంటారు. వీటి ద్వారా జ‌గ‌న్ అయిన దానికీ కాని దానికి, అర్ధం ప‌ర్ధం లేని ప‌థ‌కాలు ర‌చించేవార‌ని అంటారు.

అలాగ‌ని ఈ కాపీ పేస్ట్ ప‌థ‌కాలు ఆయ‌న‌కి ఏమంత క‌లిసొచ్చిన ప‌రిస్థితి లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఇంత పెద్ద ఎత్తున ఎడా పెడా ప‌థ‌కాలిచ్చినా స‌రే ఆయ‌న గెల‌వ‌లేక పోయారు. అంటే ఆయ‌న ఈ ప‌థ‌కాల‌ను ఏమంత బాధ్య‌త కొద్దీ త‌యారు చేసిన‌వి కావు. ఒక‌ ఆలోచ‌న‌తో చేసిన‌వి కూడా కావు. అస‌లు జ‌గ‌న్ ప‌థ‌కాలంటే.. ఖ‌ర్చు భారం కింద లెక్క‌. పైపెచ్చు ఓట్ల కొనుగోలు వ్య‌వ‌హారంగానూ భావిస్తుంటారు. అందుకే ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయారని అంచనా వేస్తుంటారు నిపుణులు.. నిజానికి ఈ సంక్షేమ ప‌థ‌కాలకు ఆద్యుడు ఎన్టీఆర్. అప్ప‌టి నుంచే ప్ర‌జారంజ‌క ప‌థ‌కాల శ‌కం ఒక‌టి మొద‌లైంది. వాటినే ఆ త‌ర్వాత వైయ‌స్ కాపీ కొట్టారు. ఆ త‌ర్వాత కేసీఆర్ సైతం పేస్ట్ చేసేశారు. ఇక జ‌గ‌న్ సంగ‌తి స‌రే స‌రి. త‌న విస్తృ ప‌థ‌కాల త‌యారీలో అధిక శాతం.. క్రిష్టియ‌న్ లాబీ నుంచి వ‌చ్చిన స‌ల‌హా సూచ‌న‌ల‌కు త‌న సొంత త‌యారీలా క‌ల‌రింగ్ ఇచ్చి.. జ‌నాల్లోకి వ‌దిలేస్తుంటార‌ని అంటారు.

నిజానికి ఒక ప‌థ‌కం అంటే అది ప్ర‌భుత్వానికి భారం కారాదు. పెట్టుబ‌డిగా ఉండాలి. అదెలాగో తెలియాలంటే మ‌న‌కు చంద్ర‌బాబు నూత‌న సృష్టి పీ- 4. ఇది నిజంగా ఒక అద్భుత‌మైన ప‌థ‌కం. ఇదే జ‌గ‌న్ త‌న హ‌యాంలో అర్ధం ప‌ర్ధం లేకుండా చేసిన ఖ‌ర్చు ఆయ‌న స్వార్ధానికి సంబంధించిన వ్య‌వ‌హారం. ఈ మొత్తం పెట్టుబ‌డి కింద‌ పెట్టి మంచి రాజ‌ధాని నిర్మాణం చేసి ఉంటే.. అది ఈ పాటికి ఎన్నో ప‌నుల‌ను సృష్టించి ఉండేది. ఈ విష‌యం గుర్తించారు కాబ‌ట్టే.. జ‌నం ఆయ‌న్ను తిప్పి కొట్టారు.అలాంటి జ‌గ‌న్ ఆయ‌న పార్టీ లోకేష్ త‌మ అమ్మ ఒడినే కాపీ కొట్టి అమ్మ‌కు వంద‌నంగా పేరు మార్చార‌ని చెప్పుకోవ‌డం చూస్తుంటే వింత‌గా ఉంద‌ని అంటారు విశ్లేష‌కులు.

By
en-us Political News

  
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.
సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఒకే కుర్చీలో కూర్చోవడానికి చాలా మంది పోటీ పడతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. పరోక్షంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు చేశారు.
మహబూబాబాద్ జిల్లాలో జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగిందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తీవ్ర సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసు మరువక ముందే మరో ఘటన కుత్బు ల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పరిధిలో ఓ అక్రమ సరోగసి సెంటర్ ఉన్నట్లుగా విశ్వసనీ యమైన సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు.
ఇటు నుంచి కాకపోతే, అటునుంచి నరుక్కురమ్మని అంటారు, పెద్దలు. మాజీ క్రికెటర్, ప్రస్తుత పొలిటీషియన్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడు, మహమ్మద్ అజారుద్దీన్, అక్షరాలా అదే చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అయిదేళ్లపాటు సాగిన మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని సిట్ అధికారులు తమ అనుబంధ చార్జ్‌షీట్లో స్పష్టంగా పేర్కొన్నారు .
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఏపీలో అభివృద్ధి, సంక్షేమం సమనంగా ముందుకు సాగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్​కల్యాణ్​ అన్నారు. సూపర్ సిక్స్​పథకాలను అమలు చేస్తూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పవన్ తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల పరిధిలో వైసీపీకీ 64% ఓట్లు సాధించిందని ఇప్పుడు 8.95% ఓట్లు రావడమేంటని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు.
పరిపాలనలోనూ విదేశీ పర్యటనలు వంటి వివిధ అంశాలపై పలు రికార్డులను సృష్టించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డు నెలకొల్పారు
అవి ఎమ‌ర్జెన్సీ త‌ర్వాతి కాలం రోజులు.. అప్పుడు వైఎస్‌ఆర్ ఏమంత గొప్ప ఇందిరాగాంధీ కుటుంబ భ‌క్తుడు కాడు. పైపెచ్చు కుటుంబ పాల‌న‌కు సంబంధించి తీవ్రంగా దుయ్య‌బ‌డుతూ ఉండేవారాయ‌న‌.
వైసీపీ భయపడినంతా అయ్యింది. వైసీసీ అధినేత జగన్ కు స్వయానా సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల జగన్ పై నిప్పులు చెరిగారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలలో అన్యాయం జరిగిందంటూ ఆక్రోశం వ్యక్తం చేసిన జగన్.. ఆ సందర్బంగా రాహుల్ గాంధీపై కూడా విమర్శలు కురిపించారు.
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గోల్కొండలో సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్క‌రించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.