Publish Date:Apr 30, 2022
తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశంసల వర్షం కురిపించి నెల రోజులు గడిచిందో లేదో.. తెలంగాణ సీఎస్ పనితీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు సీజేఐ ఎన్వీ రమణ. ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ వచ్చిన సీజేఐ ఎన్వీ రమణ దేశంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు కేసీఆర్ సహకారం కారణమన్నారు. అలాగే న్యాయాధికారుల పోస్టుల మంజూరులో ఆయన చూపిన చొరవను బహుదా ప్రశంసించారు. అంతలోనే ఏమైందో ఏమో శనివారం హస్తినలో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సదస్సులో తెలంగాణ సీఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, హైకోర్టు సీజేలు తీసుకున్న నిర్ణయాల అమలులో సీఎస్ అలక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఈ సదస్సుకు సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. సీజేఐ సీఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేయడానికీ, సీఎం ఈ సదస్సుకు హాజరు కాకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా అన్న సందేహాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు కు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొట్టారు. చీటికీ మాటికీ హస్తిన బయలుదేరే సీఎం కేసీఆర్ ఈ సదస్సుకు డుమ్మా కొట్టడానికి కారణమేమిటన్న విషయంపై సర్వత్రా ఆసక్కి నెలకొంది. రాజకీయ కారణాల వల్లనే కేసీఆర్ ఈ సదస్సుకు డుమ్మా కొట్టారని అంతా భావిస్తున్నారు. అయితే సీజేఐ తెలంగాణ సీఎస్ తీరుపై చేసిన వ్యాఖ్యలతో కేవలం రాజకీయ కారణాలే కాకుండా ఇతరేతర కారణాలు కూడా సీఎం కేసీఆర్ ఈ సదస్సుకు గైర్హాజర్ కావడానికి కారణమై ఉంటుందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీని ఫేస్ చేయడం ఇష్టం లేదన్న ఒక్క కారణంతో ఇంత కీలకమైన సదస్సుకు సీఎం డుమ్మా కొట్టారా అన్న సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణలోని న్యాయవ్యవస్థ సమస్యల పరిష్కారంపై సీఎం, హైకోర్టు సీజే పలు నిర్ణయాలు తీసుకున్న
ప్పటికీ అవి అమలు కాకపోవడం.. దానిపై సీజేఐకు వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితిని దాటవేయడానికే సీఎం ఈ సదస్సుకు గైర్హజరయ్యారని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ కోర్టుల్లో దయనీయ పరిస్థితులపై రమణ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ డుమ్మాకు ఇది కూడా ఒక కారణమన్న భావన వ్యక్తం అవుతోంది. ఆర్భాటంగా నిర్ణయాలు ప్రకటించడం, ఆ తరువాత వాటి గురించి పట్టించుకోకపోవడం కేసీఆర్ శైలి.. ఆ కారణంగానే కోర్టులలో సదుపాయాలు, సౌకర్యాలపై కేసీఆర్ నిర్ణయాలు అమలు కాకపోవడంపై సమాధానం ఇచ్చుకునే పరిస్థితిని తప్పించుకోవడానికి కూడా కేసీఆర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు గైర్హాజర్ కావడానికి ఒక కారణమై ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-cm-absent-cji-furious-on-telangana-cs-39-135281.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.