చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు తెచ్చారు?

Publish Date:Aug 31, 2015

Advertisement

 

ఈరోజు ఆంద్రప్రదేశ్ శాసనసభ సమావేశాలలో ప్రత్యేక హోదా అంశంపై వైకాపా రాద్దాంతం చేస్తుందని ప్రభుత్వం ముందే ఊహించింది. ఊహించినట్లే జగన్ తెదేపా, బీజేపీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడంతో ఆయన కూడా కాంగ్రెస్ అధిష్టానం-జగన్మోహన్ రెడ్డిల మధ్య జరిగిన రహస్య ఒప్పందం ప్రస్తావన చేసి జగన్ బండారాన్ని బయటపెట్టారు.

 

అక్రమాస్తుల కేసుల్లో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డిపై ఏకంగా 11 చార్జ్ షీట్లు నమోదు చేయబడ్డాయి. ఒకవేళ ఆ సమయంలో రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికలు జరగకపోయినట్లయితే బహుశః ఆయన ఇప్పటికీ జైల్లోనే ఉండేవారేమో కూడా. తెలంగాణాలో ఉద్యమాలు ఉదృతం కావడంతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు పూనుకొంది. అయితే కేవలం ఉద్యమాల ఒత్తిడికి తలొగ్గే తెలంగాణా ఏర్పాటు చేసేందుకు సిద్దపడిందని అనుకోవడానికి లేదు. మోడీ ప్రవేశంతో కేంద్రంలో తిరిగి అధికారం నిలబెట్టుకొనే అవకాశాలు సన్నగిల్లాయనే వాస్తవాన్ని చాలా ముందే పసికట్టిన కాంగ్రెస్ అధిష్టానం, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేక వ్యూహం అమలుచేయడం ద్వారా తన విజయావకాశాలను మెరుగుపరుచుకోవాలనుకొంది.

 

ఆ ప్రయత్నాలలో భాగంగానే రాష్ట్ర విభజన చేసి తెలంగాణాలో తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడం ద్వారా అక్కడ విజయం సాధించవచ్చని భావించింది. కానీ రాష్ట్ర విభజన చేసినట్లయితే ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని గ్రహించడంతో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకతను జగన్ కి అనుకూలంగా మలిచి ఎన్నికల అనంతరం వైకాపా మద్దతు పొందవచ్చని ఎత్తు వేసింది.

 

కాంగ్రెస్ అధిష్టానం-జగన్ మధ్య రహస్య అవగాహన కుదరడం వలననే జగన్ పై 11 చార్జ్ షీట్లు నమోదు చేసిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ అకస్మాత్తుగా మహారాష్ట్రాకి బదిలీ అయిపోయారు. ఆయన బదిలీ అయిపోవడం, తరువాత జగన్ తో సహా అందరికీ బెయిలు మంజూరు అవడం, ఆ కేసులను ఎక్కడో చెన్నైలో సీబీఐ అధికారికి బదలాయించడం, క్రమంగా అవన్నీ అటకెక్కడం, ఎన్నికలు జరగడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

 

కాంగ్రెస్-వైయస్సారో కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రంలో డ్డీ కొనబోతున్న తరుణంలో కూడా “జగన్ నా కొడుకు వంటివాడు,” అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ సింగ్ అనడం గమనిస్తే ఆ రెండు పార్టీల మధ్య అవగాహనా ఉందని అర్ధమవుతోంది. అలాగే “ఎన్నికల తరువాత వైకాపా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది,” అని వైకాపాలో చేరాలనుకొన్న సబ్బం హరి విస్పష్టంగా ప్రకటించడం మరో ఉదాహరణ. కానీ ఆయన తమ రహస్య అవగాహనని బయటపెట్టడంతో, ప్రజలలో కాంగ్రెస్ పట్ల నెలకొన్న వ్యతిరేకత తన పార్టీకి ఎదురవుతుందనే భయంతో సబ్బం హరికి పార్టీలో రాకముందే తలుపులు మూసేశారు.

 

చివరికి కాంగ్రెస్ వ్యూహం బెడిసికొట్టింది. తెరాస, వైకాపాలు రెండూ హ్యాండిచ్చాయి. వైకాపా వ్యూహం కూడా బెడిసి కొట్టింది. ఒకవేళ కాంగ్రెస్ మళ్ళీ అధికారం నిలబెట్టుకొని ఉండి ఉంటే బహుశః ఆ రెండు పార్టీలు ఇప్పుడు యూపీఏ కూటమిలో భాగస్వాములుగా ఉండేవేమో? కానీ కాంగ్రెస్ ఓడిపోవడంతో రహస్య ఒప్పందాలన్నీ బుట్ట దాఖలయ్యాయి. ఈ రాజకీయ చదరంగాన్ని మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీయే చివరికి అన్ని చోట్లా ఓడిపోగా అందులో పాల్గొన్న తెరాస, వైకాపాలు లబ్ది పొందాయి.

 

కానీ కాంగ్రెస్ అధిష్టానంలాగే జగన్ మోహన్ రెడ్డి కూడా కొంచెం అతి తెలివితేటలు, అతి విశ్వాసం ప్రదర్శించడంతో ఎన్నికలలో బోర్లాపడ్డారు. కానీ తెరాస అధ్యక్షుడు కేసీఆర్ చాలా తెలివిగా పావులు కదుపుతూ విజయం సాధించగలిగారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాలకి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం బలయిపోయింది. కానీ సరిగా ఆ కారణంగానే జగన్ జైలు నుండి విముక్తి పొందడమే కాకుండా, కాంగ్రెస్ కోరుకొన్నట్లే దాని ఓట్లను కూడా తన ఖాతాలో వేసుకొని ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎదగగలిగారు. కానీ ముఖ్యమంత్రి అవ్వాలనే తన కోరికను నెరవేర్చుకోలేకపోయారు. దానికి చంద్రబాబు నాయుడు సైందవుడిలా అడ్డుపడ్డారనే దుగ్ధతో అందివచ్చిన ప్రతీ అంశాన్ని ఒక అస్త్రంగా మలుచుకొంటూ ఆయనపై ప్రయోగిస్తున్నారు.

 

ప్రత్యేక హోదా విషయంలో కూడా ఆయనని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసినప్పుడు, రాష్ట్ర విభజన సమయంలో జగన్ నిర్వాకాన్ని ఎండగట్టారు. పార్లమెంటు తలుపులు, కిటికీలు మూసివేసి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన బిల్లుని ఆమోదిస్తున్నప్పుడు జగన్ ఎక్కడ దాకొన్నారు? అని ప్రశ్నించడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో ఉన్న రహస్య ఒప్పందం లేదా అవగాహన కారణంగానే, అత్యంత ముఖ్యమయిన సమయంలో జగన్ పార్లమెంటుకి వెళ్ళకుండా డుమ్మా కొట్టారని చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్పారు. రాష్ట్ర విభజనకి పరోక్షంగా కారకుడయిన అటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఉద్యమించడం, దాని ద్వారా తనను, తన ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని భావించిన చంద్రబాబు నాయుడు కూడా క్రమంగా మరుగునపడుతున్న కాంగ్రెస్-వైకాపాల మధ్య జరిగిన ఈ తెరచాటు వ్యవహారాన్ని ఆయనకు శాసన సభ సాక్షిగా మరొక్కమారు గుర్తు చేసారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.