Publish Date:Jul 31, 2026
నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. పలువురు భవన శిధిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ దుర్ఘటనమహారాష్ట్ర భివండి ప్రాంతంలో అర్దరాత్రి దాటిన తరువాత జరిగింది. ఘటన జరిగిన సమయంలో భవనంలో వారంతా గాఢ నిద్రలో ఉండటం వల్లే ప్రాణనష్టం జరిగిందని భావిస్తున్నారు.
ఘటన జరిగిన సమయంలో భవనంలో పాతిక నుంచి ముఫ్ఫై మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ భవనంలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు భవనం ఒకవైపునకు ఒరిగినట్లు కొందరు గమనించిన కొందరు భవనం నుంచి బయటకు వచ్చేశారు.
ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకూ శిథిలాల కింద చిక్కుకున్న ఒక మహిళను ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షఇతంగా బయటకు తీశారు. శిథిలాల నుంచి ఆరు మృతదేహాలను వెలికి తీశారు.
Bhiwandi building collapse, Thane building accident, NDRF rescue operation Bhiwandi, Telugu One
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-building-collapse-36-227610.html
జెన్ జీ దెబ్బకు మోదీ అర్ధరాత్రి ఇన్స్టా వీడియో పెట్టాల్సి వచ్చింది..!
నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు.. శెహభాష్..లోకేష్` అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భుజం తట్టారు.
ఏపీ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు కేవలం విమర్శలు, ప్రతివిమర్శలకే పరిమితం కాకుండా, శాంతిభద్రతలు వ్యవస్థల పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేపడుతున్న పరామర్శ యాత్రలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్, ఆ సంస్థ మాజీ ఛైర్మన్ అనిల్ డి. అంబానీతో పాటు పలువురు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు, ఇతర వ్యక్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ఆధ్వర్యంలో పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మరొక అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టం నమోదైంది.
ఉత్తరాంధ్ర ప్రగతికి ప్రతిరూపంగా నిలిచే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంపై
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం చంద్రబాబు అన్నారు.
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీపి కబురు అందించాయి.
మోదీ వికసిత్ భారత్... సీబీఎన్ విజన్ ప్రతిరూపం భోగాపురం..!
ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి మహత్తర అడుగు పడింది.
పెళ్లైన నెలలకే షాక్..ఆస్ట్రేలియా ఉద్యోగం పేరుతో ఘరానా మోసం..!