ఆ పదిమందికీ బీఆర్ఎస్ తలుపులు తెరిచే ఉన్నాయా?

Publish Date:Apr 26, 2025

Advertisement

బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగతున్న వేళ, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచిన, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన 10 మంది ఎమ్మెల్యేల పునరాగమనం గురించి ఆసక్తికర  చర్చ జరుగుతోంది.  నిజానికి నిన్న మొన్నటి వరకు పార్టీ కార్యనిర్వాహ అధ్యక్షుడు కేటీ రామరావు చాలా స్పష్టంగా ఆ పది మందిలో ఏ ఒక్కరినీ వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని ఖరాఖండిగా చెపుతూ వచ్చారు. అయితే.. తాజాగా కేటీఆర్ అది తన వ్యక్తిగత అభిప్రాయమనీ,  అలాంటి  అతి ముఖ్యమైన విషయంలో పార్టీ, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు.

 అంటే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని చెప్పకనే చెప్పినట్లు అయిందని అంటున్నారు. నిజానికి.. చాలా కాలంగా కేటీఆర్ పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ తలుపులు శాశ్వతంగా ముసుకు పోయాయనీ.. మళ్ళీ వస్తామని వేడుకున్నా, ప్రాధేయ పడినా  బీఆర్ఎస్ తలుపులు మళ్ళీ తెరుచుకోవని అడిగినా,  అడగక పోయిా అందరికీ చెపుతూ వచ్చారు. ఆ పది మందిని మళ్ళీ పార్టీలోకి రానిచ్చేది లేదని ఒకసారి కాదు..  ఒక భాషలో, ఒక ఇంటర్వ్యూలో కాదు ప్రతి ఇంటర్వ్యూలో అదే మాట చెపుతూ వచ్చారు. అలాగే ఆ పది నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని, చెప్పారు.  

అలాగే.. పార్టీ ఫిరాయించినఎమ్మెల్యేలు భయపడవలసిన అవసరం లేదని, ఉప ఎన్నికలు రావంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనను కేటీఆర్  ప్రతి ఇంటర్వ్యూలోనూ  తప్పు పట్టారు.  సుప్రీం కోర్టు విచారణలో ఉన్న అంశంపై  ముఖ్యమంత్రి సభలో మాట్లాడదాన్ని కూడా తప్పు పట్టారు.సుప్రీం కోర్టు కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టిందని అన్నారు. ఆ పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు తప్పవని కటీఆర్ చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తామని, ఒకటికి  పదిసార్లు చెప్పారు. అంతే కాదు, పార్టీ నాయకులు కార్యకర్తల సెంటిమెంట్స్ ను గౌరవించాలని అన్నారు. కొత్త నాయకత్వాన్ని పోటీకి సిద్దం చేస్తున్నామని చెప్పారు. మరోవంక,ఆ పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ.. కేటీఆర్ మరి కొందరు  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టు విచారణ పూర్తి చేసింది. తీర్పును వాయిదా వేసింది. ఈ నేపధ్యంలోనే కేటీఆర్  ఉప ఎన్నికలు తధ్యమని చెపుతూ వచ్చారు. 
అయితే, ఇప్పడు అదే కేటీఆర్  పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలో చేర్చుకోరాదనేది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అంటూ.. తుది నిర్ణయం తీసుకోవలసింది పార్టీనే అంటూ.. కొత్త పాట, కొత్త పల్లవి ఎత్తుకున్నారు. 

ఈ నేపధ్యంలోనే కేటీఆర్  మాటల్లో ఈ మార్పు ఎందుకొచ్చింది అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోందని అంటున్నారు. అది కూడా, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ముందు కేటీఆర్ టోన్ ఎందుకు మారింది? రజతోత్సవ సభ వేదికగా, ఎవరైనా స్వగృహ ప్రవేశం చేస్తారా? అందుకే కేటీఆర్, మాట మారిందా? అనే చర్చ జరుగుతోందని అంటున్నారు.అయినా,  పార్టీలు ఫిరాయించడం ఎలాగో, మాట మార్చడం కూడా రాజకీయాల్లో  మాములే..  అందుకే ఏనాడో కన్యాశుల్కం, గిరీశం ఒపీనియన్స్ మార్చుకోలేని వాడు పొలిటీషియన్ కాలేరని అన్నారని అంటున్నారు. సో... ఇతర విషయాలు ఎలా ఉన్నా... పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్ళీ  గులాబీ గూటికి రావాలనుకుంటే రావచ్చును.అన్ని తలుపులు అన్ని వైపులా తెరిచే ఉన్నాయి.. అంటున్నారు.

By
en-us Political News

  
హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లిలో ఒక మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
 తెలుగుదేశం పార్టీ నాయకుడిపై వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ ​దాడికి పాల్పడ్డాడు. రాజధాని పరిధిలోని ఉద్దండరాయుని పాలెంలో టీడీపీ నేత రాజుపై నిన్న రాత్రి నందిగం సురేష్​, అతని అన్న ప్రభుదాసు దాడికి పాల్పడ్డారు
హైదరాబాద్ గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రమాద వివరాలు తెలిసి అత్యంత షాక్‌కు, బాధకు గురయ్యానని ఆయన తెలిపారు.
హైదరాబాద్ గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి ఎక్స్ ద్వారా తెలిపారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున సుప్రభాత సేవ ముగిసిన తర్వాత వీఐపీ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌.డి రేవణ్ణ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఇండియన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, నటి ఐశ్వర్య రాజేష్, నటుడు వైభవ్, ఆది పినిశెట్టి ఆయన సతీమణి నిక్కీ గల్రాని శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఇంచుమించుగా 18 నెలలు అంటే సంవత్సరంన్నర కావస్తోంది. ద్వితీయ వార్షికోత్సవం దగ్గర పడుతోంది.కానీ, ఇంత వరకు పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పడ లేదు. కారాణాలు ఏమైనా, గతంలో అనేక మార్లు పెట్టిన మంత్రివర్గ విస్తరణ ముహూర్తాలు వచ్చి పోయాయే కానీ, ఏ ఒక్కటీ ముడి పడలేదు.
హైదరాబాద్‌ చార్మినార్‌ పరిధి గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలున్నారు. ఆదివారం ఉదయం భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి.
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 101వ మిషన్‌ పీఎస్‌ఎల్‌వీ సీ61 సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం పూర్తి కాలేదు. ఆదివారం ఉదయం 5.59 గంటలకు రాకెట్‌ను ప్రయోగించిన తర్వాత మూడో ద‌శ అనంతరం రాకెట్‌లో త‌లెత్తిన సాంకేతిక‌ స‌మ‌స్య తలెత్తినట్లు ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్ల‌డించారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ప్రపంచ దేశాల నుంచి గట్టి మద్దతు లభించింది. చైనా, టర్కీ వంటి కొన్ని దేశాలు పాకిస్థాన్ కు మద్దతు పలికినా, మెజారిటీ దేశాలు మన దేశానికి సంపూర్ణ మద్దతునిచ్చాయి.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పార్టీలో, ప్రభుత్వంలో ప్రమోషన్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కడపలో జరగనున్న పసుపు పండుగ మహానాడు వేదికగా నారా లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ ఇస్తారనీ, ఆయన కోసమే ఒక పార్టీలో ఓ కొత్త పదవి సృష్టించి మరీ ఆయనకు మరింత కీలక పదవి, కీలక బాధ్యతలు అప్పగిస్తారనీ తెలుస్తోంది.
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని హైదరాబాదులోని వారి నివాసానికి వెళ్లి సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల సుజనా చౌదరి లండన్ లో ఓ ప్రమాదంలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఇంటికెళ్ళి ఆయన ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్థికశాస్త్ర నిపుణుడు, నోబెల్‌ అవార్డు గ్రహీత అభిజిత్‌ బెనర్జీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఆదాయాన్ని పెంచేందుకు ఉన్న మార్గాలు తదితర అంశాలపై చర్చించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.