రోడ్ల నాణ్యత.. దేశంలోనే ఏపీ నంబర్ 2.!

Publish Date:Jul 10, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల నాణ్యత దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. జగన్ హయాంలో ఐదేళ్ల పాటు.. ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై దేశ వ్యాప్తంగా సెటైర్లు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పొరుగు రాష్ట్రంలో అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు.. ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితిని ఎత్తి చూపుతూ తెలంగాణ అభివృద్ధి గురించి గొప్పగా చెప్పుకునే వారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అంటే గుంతలేనని ఎద్దేవా చేసేవారు. ఆ రహదారులపై ప్రయాణించలేక జనం అవస్థలు పడేవారు. గుంతల మయమైన రోడ్ల కారణంగా ప్రమాదాలకు గురై పెద్ద సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయి. అయితే అదంతా గతం. 

రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు మరీ ముఖ్యంగా   గ్రామీణ రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్లలోనే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడింది. ఏపీలో రోడ్ల నాణ్యత ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్ వై) జాతీయ తనిఖీ నివేదికల ప్రకారం, గ్రామీణ రోడ్ల నాణ్యతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.

గతంలో..  అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో రోడ్ల నాణ్యతలో దేశంలో దారుణంగా 19వ ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్ తాజా నివేదిక ప్రకారం   2వ స్థానానికి ఎగబాకి  కొత్త రికార్డు సృష్టించింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 19వ స్థానం నుండి రెండో స్థానానికి చేరడం ఒక అద్భుత విజయంగా.. పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పీఎంజీఎస్‌వై నేషనల్ క్వాలిటీ మానిటరింగ్ విభాగం ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా పూర్తయిన రోడ్డు పనులపై సమగ్ర మూల్యాంకనం నిర్వహించి ఈ ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో గుజరాత్ మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానాన్ని దక్కించుకుంది

జాతీయ స్థాయిలో మొత్తం 2 వేల 948 రోడ్లను కేంద్ర బృందాలు   తనిఖీ చేయగా, అందులో 441 రోడ్లు నాణ్యతా ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రాష్ట్రవ్యాప్తంగా తనిఖీ చేసిన 126 ప్రధాన గ్రామీణ రహదారుల్లో కేవలం ఒక్కటంటే ఒక్క రోడ్డు మాత్రమే ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన నూటపాతిక రోడ్లూ కూడా,  అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిర్మితమయ్యాయని కేంద్ర నివేదిక పేర్కొంది. 

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న   నిర్ణయాలు, పటిష్టమైన నిఘా వ్యవస్థే రోడ్ల నాణ్యత విషయంలో ఏపీ ఈ ఘనత సాధించడానికి కారణమని చెప్పవచ్చు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచే..  పవన్ కళ్యాణ్ గ్రామీణ రహదారుల పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి తావులేకుండా, నిధులు దుర్వినియోగం కాకుండా కఠిన నిబంధనలను అమలు చేశారు. సోషల్ మీడియా వేదికల ద్వారా మారుమూల గ్రామాల ప్రజలు తమ ప్రాంతాల్లోని   రోడ్ల పరిస్థితి గురించి  ఫిర్యాదు చేసిన ప్రతి సందర్భంలోనూ  పంచాయతీరాజ్ శాఖ తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేస్తూ మరమ్మతులు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ సమన్వయంతో సాగడం వల్లే ఏపీ రోడ్ల వ్యవస్థలో ఈ మార్పు సాధ్యమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Pawan Kalyan, Andhra Pradesh News, PMGSY National Rankings, Rural Road Development, AP Panchayat Raj

By
en-us Political News

  
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది.
రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి.
ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.
1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా పక్కన పెట్టడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆరున్నర దశాబ్దాల క్రితం క్రితం కుదిరిన ఈ ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, ఆధునీకరించాలని న్యూఢిల్లీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఒప్పందంలో మార్పులు జరిగే వరకు పాకిస్తాన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఇండియా.. తన సార్వభౌమత్వ పరిధిలోని పనులను వేగవంతం చేసింది.
ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డేయే రోహిత్ శర్మ చివరి మ్యాచ్ అన్న ప్రచారానికి బలం చేకూర్చే విధంగా.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. దీంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు అయితే ఇది రోహిత్ శర్మ సొంత నిర్ణయమా? బిసిసిఐ పెద్దలు, చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మకంగా పొమ్మనలేక పెడుతున్న పొగా అన్న అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో బలంగా వ్యక్తమౌతున్నాయి.
రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీకి చెందిన ఆదివాసీలు ఈ సభలో పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లోని గిరిజన జిల్లాలను, సరిహద్దు గ్రామాలను అన్నింటినీ ఒకే చోటికి చేర్చి, ఒక సమగ్రమైన గిరిజన రాష్ట్రంగా మార్చాలని సభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు.
చేనేత రంగానికి ప్రగడ కోటయ్య అందించిన సేవలను, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తించి.. రాబోయే తరాలకు ఆయన ఆశయాలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన ఆదేశాలు వెలువరించింది.
ఏపీలో తల్లికి వందనం పథకం కింద జూలై 22న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ కానున్నాయి. అంగన్వాడీ, శానిటేషన్ వర్కర్ల పిల్లలకు వర్తించే కొత్త రూల్స్, బడ్జెట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు సంఘీభావం తెలపడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రముఖులు దీక్షా శిబిరానికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఆయన పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూనే, ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి దీక్షను విరమించాలని కోరారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవిని తిరస్కరించి, ఆర్‌సీబీతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇక్కడ చదవండి.
సరైన రహదారి లేక అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా బొడ్డుమామిడి గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించింది. దీంతో దశాబ్దాల ల సాకారమవుతుండటంపై గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
జూలై 18 నాటి న్యూయార్క్ టైమ్స్ కనెక్షన్స్ పజిల్ గేమ్ 1133 హింట్స్ మరియు ఖచ్చితమైన సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి. మీ విన్నింగ్ స్ట్రీక్‌ను సులభంగా కాపాడుకోండి.
అమెరికాలో ఏఐ కంపెనీల సంపద పంపిణీపై సంచలన సర్వే వెలుగులోకి వచ్చింది. కంపెనీల స్టాక్‌లో 50 శాతం వాటాను పబ్లిక్ వెల్త్ ఫండ్‌కు బదిలీ చేయాలనే ప్రతిపాదనకు 69% మంది ప్రజలు మద్దతు ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.