ఇక రె "ఢీ"

Publish Date:Aug 1, 2016

Advertisement

ఆంధ్రప్రదేశ్‌‌కు ప్రత్యేకహోదా కల్పించాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు సందర్భంగా జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన వివరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన మాటల్లో తేటతెల్లం అయ్యింది. ఎన్ని సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా..ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని మరోసారి రుజువైంది. జైట్లీ ప్రకటన నేపథ్యంలో చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో కేంద్రమంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.

 

ఈ సమావేశం వేళ చంద్రబాబు ఒక రాష్ట్రధినేతగా..ఒక నిఖార్సైన రాజకీయవేత్తగా వ్యవహరించారు తప్ప ఎక్కడా పట్టుకోల్పోలేదు. గొంతులో తొణకని ఆత్మవిశ్వాసం..మితిమీరిన భావోద్వేగాలు, తీవ్ర హావభావాలు, పరుష పదజాలం ఏవి లేవు..దగా పడి, గాయపడిన మనసు తాలూకూ ఉక్రోశం, బేలతనం జాడ మచ్చుకు కూడా కనిపించలేదే. ప్రభుత్వంలో ఉండి ఏం సాధించారని ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలు..బయటకు రమ్మంటూ విసుర్లు. కానీ ఎప్పుడు ఏం చేయాలో తెలిసినవాడే అసలైన నాయకుడు. అందుకే ఎవరెన్ని మాటలన్నా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రాజనీతితో వ్యవహరిస్తున్నారు ఏపీ సీఎం. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పెదవి విరుస్తూనే..ఇచ్చిన హామీలను గుర్చు చేస్తూ సాగింది ఆ ప్రసంగం.  ఒకప్పుడు చెన్నై నుంచి కర్నూలుకు అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరాం. అరవై ఏళ్లు ఉన్న తర్వాత నెత్తిన అప్పు పెట్టుకుని అమరావతికి వచ్చాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి, ప్రధానమంత్రికి లేదా..? ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు.. ఏపీ కూడా ఈ దేశంలో అంతర్భాగం, మనమూ పన్నులు కడుతున్నాం. అలాంటప్పుడు మనకు మాత్రమే ఎందుకు అన్యాయం జరగాలంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఎందుకు విభజించారు:
ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు...ఏపీ ప్రజలు కోరుకున్న విభజన కాదిది. రాష్ట్రంలో వనరులు లేవని అనుకున్నపుడు విభజనకు ఎందుకు ఒప్పుకున్నారని చంద్రబాబు బీజేపీని ప్రశ్నించారు. నాడు విభజనకు అన్ని పార్టీలు అంగీకరించాయని, మెజారిటీ పార్టీలన్నీ, హోదా, విభజన చట్టానికి అనుకూలమేనన్న సంకేతాలను పార్లమెంట్ సాక్షిగా ఇచ్చాయని తెలిపారు. అప్పుడు పట్టుబట్టి ప్రత్యేకహోదా బిల్లులో పెట్టించిన బీజేపీ, ఇప్పుడేమో నిబంధనల పేర్లు చెప్పి తప్పించుకోవాలనుకుంటోందని అభిప్రాయపడ్డారు. ఏం చేయలేనపుడు ఎందుకు విభజించారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసికట్టుగా రాష్ట్రాన్ని విభజించాయని..ఆ అన్యాయాన్ని ప్రజలు మరచిపోయేలా చేయాల్సి ఉందని, నాడు అంగీకరించి, ప్రజలకు హామీలిచ్చి, నేడు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని ఎలా చెబుతారని ప్రశ్నించారు.

 

కాంగ్రెస్‌కు పట్టిన గతి గుర్తులేదా..?
ఎవరెన్ని చెప్పినా వినకుండా..హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ పన్నిన కుట్రలు అందరికి తెలుసునన్నారు. బిల్లు నెగ్గించుకోవడం కోసం పార్లమెంట్ తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారాలు సైతం నిలిపివేసి దుర్మార్గంగా వ్యవహరించారని చంద్రబాబు అన్నారు. అలాంటి కాంగ్రెస్‌కు ప్రజలు ఏ గతి పట్టించారో గుర్తులేదా..ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమతీర్పుని..హామీలు నెరవేర్చని రాజకీయ పార్టీలను వారే ఇంటికి పంపుతారని గుర్తు చేశారు.

 

ప్రధానిదే బాధ్యత
రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు గడచినా ఇప్పటికీ అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. కేంద్రం చేయ్యాల్సిన పనులు ఇప్పటికీ చేయలేదు. పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.1500 కోట్లు ఖర్చు చేశాం. రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అది నెరవేర్చలేదు, ఆర్ధిక సంఘం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు. మిగతా రాష్ట్రాలతో పాటే ఏపీని చూశారు. నేనేం ప్రత్యేకంగా ఏమి అడగటం లేదు..విభజన బిల్లులో ఉన్నవి..ప్రధాని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.

 

బంద్‌ల వల్ల ఒరిగేదేమి లేదు
ప్రత్యేక హోదాపై కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా బంద్‌లకు పిలుపునిచ్చారని, కాని ఇది సరైన ఆలోచన కాదు..అన్యాయానికి వ్యతిరేకంగా కేంద్రంతో పోరాడాల్సిందే తప్ప రాష్ట్రంలో కాదు. బంద్‌లకు పిలుపునిచ్చి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వల్ల మనకే నష్టం. జపాన్‌లో తరహా నిరసన తెలిపి కేంద్రంపై ఒత్తిడి తేవాలి. నల్లబ్యాడ్జీ ధరించి ఒక మొక్క నాటినా అదే నిరసన, బస్సు ధ్వంసం చేసినా అదే నిరసన. 

 

బాధ్యత లేని ప్రతిపక్షం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో బాధ్యత లేని ప్రతిపక్షం ఉంది. నేనేదో కేసులకు భయపడుతున్నాననడం విడ్డూరంగా ఉంది. అసలు ఈడీ కేసులు, సీబీఐ కేసులున్న వ్యక్తి భయపడాలి కానీ నాకేందుకు భయం. ఇలాంటి రాజకీయ పార్టీల అవసరం రాష్ట్రానికి ఉందా అని ప్రజలు ఆలోచించుకోవాలి. రాజకీయాలంటే తెలియకుండా సమయం, సందర్భం లేకుండా ప్రతిపక్షనాయకుడు మూర్ఖత్వంతో మాట్లాడుతున్నాడని చంద్రబాబు అన్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.