కావలసింది ఉత్తుత్తి 'యాత్రలు' కాదు, తెలుగుజాతి రక్షణకు ఐక్యతా 'మాత్రలు'!

Publish Date:Sep 4, 2013

Advertisement

 

 

 డా. ఎబికె ప్రసాద్

[సీనియర్ సంపాదకులు]

 

 

"విశాలాంధ్ర ఏర్పాటు బలీయమైన రాష్ట్రావతరణకు మార్గం వేస్తుంది. ఈ బలమైన తెలుగురాష్ట్రం భారతదేశ ఐక్యతను పటిష్టం చేస్తుంది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనేక సమస్యలకు దారితీస్తుంది, అధ్వాన్నపరిస్థితుల్ని సృష్టిస్తుంది, ఫలితంగా అప్పుడు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం దొరల, పెట్టుబడిదారుల చేతుల్లోకి జారుకుని, దెబ్బతినిపోతుంది; ప్రజాతంత్ర శక్తులు బలహీనపడి నిర్వీర్యమైపోతాయి''

                             - హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిర్మాత
                                స్వామి రామానందతీర్థ ప్రకటన
                                (1953 నవంబరు 3వ తేదీ)


ముందు చూపుగల ఆనాటి నాయకత్వం తెలుగువారందరి భావిభాగ్యోదయాన్ని కోరి, ఆంధ్రప్రదేశ్ అవతరణకు మూడేళ్ళముందే చేసిన ఈ హెచ్చరిక నేటి రాష్ట్రంలోని మూడుప్రాంతాలలోని మూర్ఖపు నాయకులకు పట్టనందుననే తెలుగుజాతికి ఇన్ని అనర్థాలు దాపురించాయి. నాటి నాయకుల దూరదృష్టికి, నేటి అరకొర జ్ఞానులయిన నాయకులకు, ప్రతీ సమస్యను పదవీ ప్రయోజనాలతో 'తూకం' వేసుకుని చూచేనాటి రాజకీయ నిరుద్యోగుల సంకుచిత దృష్టికీ మధ్య ఉన్న అంతరాన్ని స్వామి రామానందతీర్థ ప్రకటన మరొక్కసారి బట్టబయలు చేస్తోంది. రామానందతీర్థ ప్రకటనలోని హెచ్చరికను పాటించకనే రకరకాల పేర్లతో నేడు రాష్ట్రంలోని రాజకీయపక్షాలు కొన్ని పూర్తిగా పక్కదారులు పట్టి తెలుగుజాతి పరువును బజారుపాలు చేసి ఇప్పుడు "పాదయాత్రల''నీ, "బస్సు యాత్రల''నీ తలపెట్టారు. రాజకీయ పక్షాల నాయకులకు రాష్ట్ర భవితవ్యంపైన, తెలుగుజాతి భాషా సంస్కృతులపైన ఏమాత్రం గౌరవం ఉన్నా ఒక్క మాటమీద నిలబడి, జాతి విభజన ప్రతిపాదనను స్వార్థపరుల కృత్రిమ ఉద్యమాలను ఆదిలోనే ఎదిరించి, తిరస్కరించాల్సింది. కాని రాజకీయ స్వార్థప్రయోజనాల కొద్దీ వివిధస్థాయిల్లో మూడుప్రాంతాలలోని చెడిపోయిన నాయకులు ఆ పనిచేయలేక పోయారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆదినుంచీ అనేక తీర్మానాల ద్వారా అభిలషించి నిండుమనస్సుతో ఆశీర్వదించిన ఆనాటి జాతీయ కాంగ్రెస్ కుటుంబ స్వార్థప్రయోజనాల్లో నేడు ఈదులాడుతూ తెలుగుజాతిని అవమాన పరచడానికి సాహసించిన విషయం గమనించిన తరువాతనైనా తెలుగు ప్రధాన రాజకీయపక్షాలు ఎదురొడ్డి నిలవవలసింది! కాని అన్ని పక్షాలూ కుటుంబ స్వార్థప్రయోజనాల్లో ఈదులాడుతున్నవి. కాబట్టి జాతిని చీల్చడానికి తలా ఒక చెయ్యి వేశాయి!

 

రాష్ట్ర విభజన అవసరమా, అనవసరమా అన్నది కాంగ్రెస్ అధిష్ఠానపు "కుటుంబ రాజకీయం'' ప్రయోజనాల దృష్ట్యానే యు.పి.ఎ. అధ్యక్షురాలుగా, కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సోనియాగాంధి పరిశీలించింది; కొడుకు రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిగా కూర్చోబెట్టడం కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్నికల తక్కెటలో తూచబోయింది. ఇందిరాగాంధీ నాయకత్వం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భాషాప్రయుక్త రాష్ట్రాలను చీల్చడాన్ని వ్యతిరేకిస్తూ రాగా, కోడలు సోనియా 'విభజన' చిట్కా ద్వారా తొమ్మిది కోట్లమంది తెలుగుప్రజల ఐక్యతను భగ్నపరచడానికి గజ్జెకడుతున్న విషయం తెలిసి కూడా కొన్ని పార్టీలు, కొందరు నాయకులూ పోటాపోటీలమీద 'విభజన' మంత్రాన్ని ముందు సూత్రప్రాయంగా ఆమోదించి, ఆ తర్వాత ఎవరికివారు ఎక్కడ 'వెనకబడి' పోతామోనని భావించి 'మూజువాణీ' నుంచి మూకకొలువుకు మారిపోయి ఉత్తరాలు కూడా యిచ్చి రావడం పెద్ద హైలైట్! ఇప్పుడు ఆ ఉత్తరాలను వెనక్కి తీసుకోవడానికి కూడా కాంగ్రెస్ అధిష్ఠానం అనుమతివ్వదు!



అధిష్ఠానం ఎంతటి 'చావుతెలివితో' వ్యవహరించిందంటే 'విభజన' ప్రతిపాదనపైన ఈ క్షణం దాకా పాలకపక్షంగా కాంగ్రెస్ అభిప్రాయమేమిటో స్పష్టం చేయకుండా "కాగల కార్యం గంధర్వులే తీరుస్తార''న్న దిలాసాతో ఇతరపార్టీల నాయకుల అభిప్రాయాల్ని అడిగి నమోదు చేసుకుందే గాని తన నిర్ణయమేమిటో బయటపెట్టలేదు. ఇతర పక్షాలను యిరికించిం తరువాత, "వాళ్ళంతా విభజనకు అనుకూలం కాబట్టి కాంగ్రెస్ అధిష్ఠానం చేయగలిగిందేమీ లేదు, రాష్ట్రాన్ని విభజించడం తప్ప'' అని ముక్తాయింపు విసిరింది! ఈ కృత్రిమ విభజన ప్రతిపాదకుడయిన అసలు రాజకీయ నిరుద్యోగి కె.సి.ఆర్. అయినందున, "ముట్టించి ముచ్చట'' చూడడమే అతగాడి పని అని అందరికీ తెలిసినా, అతడ్ని కాంగ్రెస్ తన ప్రయోజనాల కోసం [రాహుల్ ను ప్రధాని పదవికి తీసుకురావడం]వాడుకోదలచింది; ఈ కిటుకును కూడా ప్రతిపక్షాలు, చివరికి కమ్యూనిస్టు పార్టీలోని ఒక శాఖ [సి.పి.ఐ.]సహా కనిపెట్టలేక పోయారు.


 

ఇక "తెలుగుదేశం'' అధినేత చంద్రబాబు కూడా రెండుకళ్ళ సిద్ధాంతం'' పేరిట రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్టు నటించి నటించి తనపై ఉన్న కేసుల బెడదనుంచి బయటపడడం కోసం కాంగ్రెస్ నాయకత్వాన్ని అంటకాగి, దౌర్భాగ్యపు లాలూచీ రాజీ ప్రతిపాదనగా కాంగ్రెస్ "విభజన'' సూత్రానికి "సై'' అని వచ్చాడు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయకూడని పని ఎందుకు చేశాడో తెలుగుప్రజలకు అర్థమైపోయింది. మొత్తం రాష్ట్రంలో "దేశం'' పార్టీ నిలువునా చీలిపోకుండా ఆయన ఎత్తిన ఎత్తుగడ - ప్రాంతానికో విధానాన్ని పార్టీ అనుసరించడం ద్వారా పార్టీని కాపాడుకోవటం! కాని ఈ "కిటుకు''ను కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈలోగా కాంగ్రెస్ పార్టీ తప్పుడు రాజకీయం ద్వారా అటు కోస్తాంధ్రలోనూ, ఇటు తెలంగాణాలోనూ ఆ పార్టీ వోటర్లలో భారీ స్థాయిలోనే పరువు కోల్పోతోంది. ఇది గమనించిన బాబు వర్గం జరిగిన తప్పు జరిగిపోయింది కాబట్టి, కాలిన చేతులు మానాలంటే మరో 'చిట్కా'కు తెర లేపాడు.


 

దాని పేరు "సమన్యాయం'', "విభజన వల్ల తలెత్తే సమస్యకు ముందు పరిష్కారం చూపాలి'' అలా చూపకపోతే తన "పోరాటాన్ని ఆపనని మరో యాత్ర సీమాంధ్రలో తలపెట్టాడు. కాని ఎంతసేపూ విభజనవల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపాలని కేంద్రానికి మొరపెట్టుకోవటమే తప్ప - కాంగ్రెస్ అధిష్ఠానానికి విభజనకు అంగీకారం తెలుపుతూ రాసిన ఉత్తరాన్ని మాత్రం ఈరోజు దాకా బాబు ఉపసంహరించుకోలేదు; అంటే ఇతనికీ విభజనను బలపర్చడం ద్వారా అటు తెలంగాణలో పార్టీ ప్రతిష్ఠ పోకూడదు, ఇటు కోస్తాలో 'సమైక్యాంధ్ర' పేరిట కాకపోయినా రాజధాని నిర్మాణానికి అయిదు లక్షల కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదన ద్వారా కోస్తాంధ్రులకు దగ్గర అయినట్టూ కన్పించాలి! ఈ శ్లేష్మంలో పడికొట్టుకుంటున్నాడు బాబు ప్రస్తుతానికి! వైరుధ్యంతో కూడిన ఇలాంటి ప్రకటనలు విడుదల చేస్తున్న చంద్రబాబు ఒకవైపు నుంచీ, చంద్రబాబు తన 'ప్రభావం' నుంచి జారిపోకుండా చూడ్డానికి కాంగ్రెస్ మరొక వైపునుంచీ పరస్పరం ప్రయోజనకర 'లాలూచీకుస్తీ'లలోకి దిగారు!


 

ఇందుకోసం ఈ రెండు పార్టీలలో ఒకటి తనకు ప్రత్యర్థులుగా భావించుకుంటున్న కెసిఆర్ పార్టీ టి.ఆర్.ఎస్.ను, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తుండగా, మరో పక్షంవారు [కాంగ్రెస్ వారు] మరో 'లాలూచీకుస్తీ'లో తనకు దొంగ ప్రత్యర్థులుగా భావిస్తున్న టి.డి.పి.నీ, వై.ఎస్.ఆర్. పార్టీనీ 'టార్గెట్' చేస్తున్నారు. ఎటుతిరిగీ స్వార్థ రాజకీయాలు ఇరుపక్షాలవని ప్రజలకు వివరించి చెప్పకుండానే అర్థమయిపోయింది! ఇది యిలా వుండగా నిన్నటిదాకా "దేశం'' పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బాబు బావమరిది నందమూరి హరికృష్ణ తన బావగారి మీద "రాజకీయ బాంబు''ను పేల్చాడు! 2009 ఎన్నికల సందర్భంగా తన ప్రయోజనాల కోసం చంద్రబాబు స్థానిక టి.ఆర్.ఎస్. నాయకుడు కె.సి.ఆర్.తో పొత్తులు పెట్టుకోవద్దని, పొత్తుకలసినందువల్ల రెండు ప్రాంతాలలోనూ (తెలంగాణా, కోస్తాంధ్రలలో) తీవ్ర సమస్యలు ఉత్పన్నమావుతాయనీ తాను "దేశం'' నాయకత్వాన్ని ముందుగానే హెచ్చరించానని హరికృష్ణ [02-09-2013] వెల్లడించాడు!


 

ఈ పొత్తువల్ల తెలంగాణా, సీమాంధ్రలలో "దేశం'' పార్టీ అనేక సీట్లు కోల్పోతుందని తాను హెచ్చరించినా వినలేదని ఆయన పేర్కొన్నాడు! అందువల్ల బాబును ఇరుప్రాంతాల ప్రజలూ విశ్వసించాలంటే కాంగ్రెస్ అధిష్ఠానానికి రాష్ట్ర విభజనకు అనుకూలతను వ్యక్తంచేస్తూ తాను రాసిన లేఖను ఉపసంహరించుకుని తెలుగుజాతి ఐక్యతను కాపాడడానికి సంసిద్ధతను ఈ ఆఖరి క్షణంలోనైనా బాహాటంగా వెల్లడించాలి. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ను తాను ఎంత విమర్శించినా కనీసం ఆ పార్టీ అంతవరకూ విభజించినా "ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయండి'' అంటూ చేస్తున్న ప్రకటనలను ఆపివేసి, రాష్ట్రాన్ని విభజించడానికి వీలులేదని స్పష్టాటిస్పష్టంగా ప్రకటించగల్గింది. కాని ఆ మాత్రపు సాహసం కూడా రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షనాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా బాబు చేయలేకపోవటం దురదృష్టకరం!

 

"ఆత్మగౌరవ'' నినాదంతో ఎన్టీఆర్ ఆనాడు రాష్ట్రప్రజల మనస్సుల్ని చైతన్యవంతం చేయడంతో పాటు, అంతవరకూ తెలుగుజాతిని "మద్రాసీలు''గా మాత్రమే కేంద్రనాయకులతో సహా పిలుస్తున్న దశలో ఢిల్లీని గడగడలాడించి, జాతి గౌరవాన్ని పెంచాడు. కాని, ఈనాడు చంద్రబాబు కేసుల వలయంనుంచి బయటపడేందుకు స్వార్థప్రయోజనాల్ని ముందుకునెట్టి, తెలుగుజాతి గౌరవాన్ని ఫణంగా పెట్టి కూడా, తలపెట్టిన యాత్ర మాత్రం "ఆత్మగౌరవ''యాత్ర అనిపించుకోదు! ఆత్మగౌరవమే ఉంటే ఆదిలోనే అది ప్రస్ఫుటం కావాల్సింది!

By
en-us Political News

  
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.