సురాజ్యమవని .. స్వరాజ్యం

Publish Date:Aug 16, 2013

Advertisement

 

 

 

.....సాయి లక్ష్మీ మద్దాల

 

నేడు భారతావని అంతటా 67వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకుంటోంది. భారతదేశం సస్యశ్యామల దేశం. ఎన్నో సహజ వనరులు పుష్కలంగా ఉన్న దేశం. అభివ్రిద్ది విషయంలో మాత్రం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నామనే చెప్పుకుంటున్నాం. 67 వసంతాలు గడిచినా భారత ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలు అనేకం.  పేదరికం,నిరుద్యోగం,నిరక్షరాస్యత,పౌష్టికాహారలోపం,బాలకార్మికులు, లంచగొండితనం,నానాటికి పతనమవుతున్న దేశ ఆర్ధిక వ్యవస్థ.

 

ఇవే కాదు ఇంకా చాలా సమస్యలు నేడు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. సహజవనరులను దేశ సంక్షేమానికి వినియోగిచుకోవటం లో విఫలమైన,సహజ వనరుల కుంభ కోణాల్లో మాత్రం ఆరి తేరిపోయారు మన పాలకులు. గత 9ఏళ్ళుగా యు.పి.ఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మన దేశం చూడని కుంభకోణం లేదు. కాని ప్రజా సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేశారు. ప్రజలను  నానాటికి సోమరిపోతులను చేసే విధంగా ప్రజాకర్షక పధకాలు. దేశంలో ఎక్కడ చూసినా అదుపులో లేని శాంతి భద్రతలు. మెరుగైన విద్యను అందించలేని ప్రభుత్వ వైఫల్యం కారణంగా వీధికోకటిగా పుట్టుకొస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు,ఫలితంగా అందరికి అందుబాటులో లేకుండా పోతున్న విద్య. ఎలాంటి వసతులు లేని,పరికరాలు లేని ప్రభుత్వ ఆసుపత్రులు,దీనికారణంగా వెలుగు చూస్తున్న కార్పోరేట్ ఆసుపత్రులు ఫలితంగా సామాన్యుడికి అడుబాటు లో లేని వైద్యం. తాగటానికి గుక్కెడు నీళ్ళు కావాలంటే మైళ్ళ కొద్ది దూరం వెళ్ళాల్సిన పరిస్థితి.


             
 గ్రామాల పరిస్థితి మరీ దుర్భరం. వ్యవసాయాన్ని ఆదుకొనేవాడు కనబడక రైతు దిగాలుపడిపోతు,ఆత్మహత్యలు చేస్కుంటున్న రైతన్నలు. మగ్గాలు కదలనంటున్న చేనేత రైతుల పరిస్థితి మరీ దారుణం. ఇవన్ని దేశ ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలు. ఇంక నేతల విషయానికి వస్తే దేశ సమగ్రతను కాపాడాలన్న బలమైన తపన ఏ ఒక్క రాజకీయ నేతకు లేదు. కేవలం దేశం లో ని అంతర్గత సమస్యలెకాదు,దేశ సరిహద్దులో పొంచి ఉన్న సమస్యల నుండైన దేశాన్ని కాపాడే యోచనలో పాలకులు ఉన్నారా అంటే అది సందేహమే. ఒక పక్క నుంచి పాకిస్తాన్ మరోపక్క నుంచి చైనా ఎప్పుడు ఏదో ఒక సమస్యను దేశం మీదికి విసురుతూనే ఉన్నాయి. ఇది మన దేశాన్ని ఏలుతున్న నేతల వైఫల్య ఫలితం కాదా. దేశం పుట్టెడు సమస్యల్లో చిక్కుకొని ఉంది. కాని ఆ సమస్యలపై చర్చించే తీరిక మన నేతలకు లేదు. కనీసం చట్ట సభ్లలోనైన ప్రజా సమస్యలు చర్చకు వస్తాయా అంటే అక్కడ ఉండేది   యుద్ద వాతావరణమే.



               ఇంక ప్రజల విషయానికి వస్తే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 66 వసంతాలు పూర్తి అయినా,వారు బానిస మనస్తత్వాన్ని వదులుకుంటున్నట్లు లేరు. ఎందుకంటే నెహ్రు తర్వాత ఇందిరాగాంధీ,ఆ తరువాత రాజీవ్ గాంధి,తరువాత సోనియా గాంధి తరువాత రాహుల్ గాంధికి అధికారాన్ని కట్టపెట్టాలని ప్రయతిస్తున్నారే తప్ప,సమర్ధులైన నాయకులను ఎన్నుకోవటం లేదు. ఎంతో అనుభవం సమర్ధత కలిగిన ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కాలేక పోయారు. ఇది రాచరికానికి మరో రూపం అవుతుందే తప్ప ప్రజాస్వామ్యం కాజాలదు. ఎన్నాళ్ళి వారసత్వ రాజకీయాలు?ప్రజాస్వామ్యమంటే ప్రజలు వోట్లు వేసి నేతలను ఎన్నుకోవటం మాత్రమే కాదు చేయాల్సింది. వారసత్వ రాజకీయాలను తిప్పికొట్ట గలగాలి. అవినీతి పరులైన నేతలకు బుద్ధి చెప్పగలగాలి,సమర్ధులైన నాయకులను ఎన్నుకోవాలి. 

By
en-us Political News

  
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.