Publish Date:Jun 22, 2025
జగన్ కి శవరాజకీయాలే కలిసివస్తున్నాయా అంటు? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. జగన్ తండ్రి మరణం ద్వారా వెలుగులోకి వచ్చారు. వైఎస్సార్ బతికి ఉంటే ఆయన రాజకీయాల్లో ఇంతగా కనిపించేవారు కారని అంటారు. వైయస్ చనిపోవడంతో గుండె ఆగి చనిపోయారని కొందరిని ఎంపిక చేసుకుని జగన్ ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు. ఇక్కడా మరణాలే జగన్ రాజకీయ ఎదుగుదలకు సోపానాలుగా పని చేశాయి.
ఆపై 2014లో జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిగా భారీ ఎన్నికల సంగ్రామాన్ని ఎదుర్కున్నారు. కానీ, ఏమంత రాణించలేక పోయారు. కారణం 'చావుల వాసన' ఎక్కడా లేక పోవడమేనంటారు. కట్ చేస్తే 2019 ఎన్నికల ముందు మార్చి 15న వైఎస్ వివేకా హత్య నింద మొత్తం నాటి బాబు ప్రభుత్వం మీద వేసి, ఎలాగోలా ఆ సెంటిమెంటుతో నెగ్గుకొచ్చేశారు.
అంతేనా, అదే ఎన్నికల ముందు.. 'డెడ్ లైన్' పాలిటిక్స్ ప్లే చేశారు. ఇక్కడ ప్రత్యేక హోదా కోసం తన ఎంపీలను రాజీనామా చేయిస్తానని బెదిరించి బ్లాక్ మెయిల్ చేశారు. ఆ నాటి ఎన్డీఏ నుంచి టీడీపీ కూడా బయటకొచ్చేలా చేసి నానా యాగీ చేశారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించి, ఆ తర్వాత ఆ ప్రత్యేక హోదాను పక్కన పడేశారు.
కట్ చేస్తే.. అధికారం పోయింది. ఇప్పుడాయన కేవలం పులివెందుల ఎంపీ. కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదు. అయినా సరే చావులెక్కడ ఉంటే అక్కడ వాలిపోతుంటారని అంటారు. తన పాత కాలపు డెడ్లీ పాలిటిక్స్ కి జగన్ తెరలేపారు. అందులో భాగంగా ఇటీవలి పాపిరెడ్డిపల్లె ఘటనలోనూ ఒక అభిమాని చనిపోయారంటూ నానా హంగామా చేశారు. కట్ చేస్తే రెంటపాళ్లలోనూ నాగమల్లేశ్వరరావు అనే కార్యకర్త చనిపోయిన ఏడాది తర్వాత ఓదార్చడానికి వెళ్తే.. అక్కడ మరో వ్యక్తి దుర్మరణం. సింగయ్య అనే ఒక వ్యక్తి జగన్ కారు కింద పడి మరణించడంతో.. ఆ కారు తోలిన డ్రైవర్ ని విచారిస్తున్నారు పోలీసులు. జగన్ జీవితంలో ఎటు చూసినా ఈ రక్తసిక్త అధ్యాయాలు కనిపిస్తాయని అంటున్నారు విశ్లేషకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/--jagan-politics-based-on-deadbodies-39-200461.html
Publish Date:Jul 10, 2025
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం (జులై 10) తెల్లవారు జామున భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారానికి పాల్పడిన పలువురు నటులు, సామాజిక మాధ్యమ ఇన్ ఫ్లుయెన్సర్లపై ఈడీ కేసుల కొరడా ఝుళిపించింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (జులై 10) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
నటుడు ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే మొత్తం వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరించేందుకు ముందుకు వచ్చింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒక జర్నలిస్టు బలవన్మరణానికి పాల్పడ్డారు.
గత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ కంపెనీని వీడనుండటంతో.. సీఈవో టిమ్కు కుక్కు అదనపు బాధ్యతలను అప్పగించింది.
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ వడోదరాలోని మహిసాగన్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది.
గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ.500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి.
గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామం గల గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎరువుల కొరత లేకుండా రాష్ట్రానికి సహకరిస్తామని తెలిపింది. యూరియా కోటా పెంచాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్రానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదికతో చర్యలు ప్రారంభించారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీలో ప్రభుత్వం రైతాంగానికి తీపి కబురు చెప్పింది. బుధవారం (జులై 9) వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధాన్యం పాత బకాయిలు రూ.1000 కోట్లలో రూ. 672 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది.