జగన్ డిశ్చార్జ్

 

 

 

వైకాపా అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు నిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన డిశ్చార్జ్ అవుతున్న సంధర్బంగా పెద్ద యెత్తున అభిమానులు తరలివచ్చారు. జగన్ సతీమణి వైయస్ భారతి, పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి తదితరులకు నిమ్స్‌కు వచ్చారు. సమైక్య రాష్ట్రం కోరుతూ ఆయన దీక్ష చేయగా పోలీసులు అరెస్టు చేసి నిమ్స్ లో చేర్చారు. ఆయన వరసగా రెండోసారి దీక్ష చేయడంతో ,ఆరోగ్యం కొంత దెబ్బతిందని డాక్టర్లు చెబుతున్నారు.దీంతో రెండు,మూడు రోజులు నిమ్స్ లోనే ఉంచి చికిత్స చేశారు.