అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్

వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్నర్ ప్రసంగం ప్రారంభించడంతోనే సభలో నినాదాలు ప్రారంభించారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలో చేస్తూ ఆందోళనకు దిగారు.

వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలనీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారుఅయితే వారి ఆందోళనను పట్టించుకోకుండా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu