కోల్‌కతా.. చివర విడత పోలింగ్.. 69 ఏళ్ల తరువాత ఓటు

 

పశ్చిమ బెంగాల్ తుది విడత పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ ఈ పోలింగ్ జరగనుంది. కాగా ఐదో దశ ఎన్నికల పోలింగ్ సమయంలో టీఎంసీ కార్యకర్తలకు, సీపీఎం కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగి హింసాత్మక ఘటనలు నెలకొన్న నేపథ్యంలో అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి సుమారు 50 వేలమంది భద్రతాదళాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కాగా పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్‌, ఈస్ట్‌మిడ్నపూర్‌ జిల్లాల్లోని 25 నియోజక వర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ లోని కూచ్ బీహార్ జిల్లాలో 15 సమూహాలకు 9 వేల మంది ఓటర్లు 69 ఏళ్ల తరువాత మొదటిసారి తమ ఓటును వినియోగించుకోనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu