ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మమతా బెనర్జీ

ఎన్నికల్లో అపూర్వ విజయం అందించిన ప్రజలకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో టీఎంసీ జయకేతనం ఎగరవేయడంతో ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. విక్టరీ సంకేతం చూపిస్తూ చిరునవ్వులు చిందించారు. ప్రత్యర్ధి శక్తులు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించారని, కానీ ప్రజలు మాత్రం ప్రశాంతంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని మమతా కొనియాడారు. అన్నింటికి మించి ఎన్ని సమస్యలు, కష్టాలు ఎదురైనా ఎన్నికల సంఘం ప్రశాంతంగా  ఎన్నికలు నిర్వహించిందని ప్రశంసించారు. ఈ నెల 27న తమ పార్టీ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu