ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా-తుమ్మల నాగేశ్వరరావు

నా పై నమ్మకం ఉంచి ఎమ్మెల్యేగా గెలిపించిన పాలేరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పేదలు, గిరిజనులు ఎక్కువగా ఉన్న పాలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు.  పాలేరు నియోజకవర్గాన్ని ఖమ్మం జిల్లాలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu