షూటింగ్ రోజే రికార్డు బ్రేక్

 

"నాయక్" చిత్రం విడుదలయ్యి దాదాపు సంవత్సరం అవుతున్నప్పటికీ దర్శకుడు వినాయక్ మాత్రం మరో ప్రాజెక్టు సెట్స్ పైకి తీసుకురాలేదు. అయితే నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సరైన కథ దొరకక ఇప్పటివరకు ఏం చేయలేరు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ దసరా రోజున నిరాడంబరంగా ప్రారంభం అయ్యింది. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి, వచ్చే సంవత్సరం వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయిన వెంటనే ఓ రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం 4.5 కోట్లకు శాటిలైట్ రైట్స్ కు అమ్ముడు పోయిందని తెలిసింది. ఇదంతా కేవలం వినాయక్ మీద ఉన్న నమ్మకంతోనే అని తెలుస్తుంది.బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది.