విజయవాడ కల్తీ మందు.. అవును మత్తు కోసం కలిపాం..!


విజయవాడ, కృష్ణలంకలో కల్తీ మందు కేసులో కీలక సమాచారం అందినట్టు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న మల్లాది విష్ణు సోదురుడు.. మల్లాది శ్రీనివాస్ కీలక సమాచారం అందించినట్టు తెలుస్తోంది. మత్తు కోసం తెల్లటి పదార్థాన్ని మందులో కలిపి క్యాషియర్ వెంకటేశ్వరరావు విక్రయించాడని శ్రీనివాస్ పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసుల క్యాషియర్ ను ప్రశ్నించగా.. మందులో స్పరిట్ కలిపామని అంగీకరించాడు. అయితే ఈకేసులో నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా తొమ్మిది బ్రాండ్లకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు శాంపిళ్లు తీసుకోగా.. దానిని సంబంధించి చేసిన పరీక్షల్లో ఈ తొమ్మిది బ్రాండ్లలో ఎలాంటి కల్తీ జరగలేదని.. స్వర్ణా బార్ లోన్ కల్తీ జరిగిందని నిర్ధారించారు. అంతేకాదు మత్తు కోసం చాలా పవర్ ఉన్న మందును వాడినట్టు అధికారులు తెలుపుతున్నారు. కాగా స్వర్ణబార్ లో కల్తీ మందు తాగి 6 గురు చనిపోగా పలువురు ఆస్వస్థకు గురైన సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu