ఆర్టీవోలపై నితిన్ ఫైర్.. బందిపోటులను మించిపోయారు..

రవాణాశాఖాధికారులను బందిపోటులతో పోలుస్తూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం మీద ఉన్న శాఖలన్నింటిలో అత్యంత అవినీతి జరిగేది రవాణా శాఖలోనే అని.. ఆర్టీవో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన రవాణాశాఖాధికారులు బందిపోటులను మించిపోయారని మండిపడ్డారు. అంతేకాదు దేశంలో డ్రైవింగ్ లైసెన్సు లు రావడం చాలా తేలికైపోయిందని.. మోటరు వాహనాల నూతన చట్టం ద్వారా రవాణా శాఖలో నూతన సంస్కరణలు తీసుకురావచ్చు కానీ.. ఆర్టీవో అధికారులు ఆచట్టం అమలు కాకుండా ఉండేందుకు మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తీసుకువస్తున్నారని అన్నారు. ప్రస్తుతం నితిన్.. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ, నౌకాయాన మంత్రిగా ఉన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu