భారత్ లో న్యాయం జరగదనే రాజీనామా.. మాల్యా

 

బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి ఎంచక్కా లండన్ చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్బంగా మాల్యా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పేరు ప్రతిష్టలకు మరింత బురద అంటించడం ఇష్టం లేకనే ఈ చర్య తీసుకున్నట్లు.. ఈ మధ్య చోటుచేసుకున్న వరుస సంఘటనలు, పరిణామాలను బట్టి చూస్తే భారత్‌లో తనకు న్యాయం లభిస్తుందన్న నమ్మకం లేదని రాజీనామా లేఖలో మాల్యా పేర్కొన్నాడు. అందుకే తన పార్లమెంట్ సభ్యత్వానికి తక్షణమే అమలులోకి వచ్చేలా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu