మొండికేస్తున్న కొద్ది మాల్యాకు బిగుస్తున్న ఉచ్చు...

 

విజయ్ మాల్యాకు రోజు రోజు ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాస్ పోర్టు రద్దు చేయగా.. కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేయడానికి ఆదేశాలిచ్చింది. ఈనేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. విజయ్ మాల్యాను దేశానికి రప్పించాలని కోరగా.. మంత్రి శాఖ ఇప్పుటికే న్యాయ నిపుణులతో చర్చలు ప్రారంభించింది. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ కనుక వస్తే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి ఇంటర్ పోల్ కు సమాచారం ఇవ్వడమే తరువాయి. ఇంకా మాల్యాకు చెందిన ఇతర బినామీ ఆస్తులపైనా కూడా ఈడీ ఆరా తీస్తుంది. మొత్తానికి మొండికేస్తున్న కొద్ది విజయమాల్యాకు ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అసలు మాల్యా మొదటే విచారణకు వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని కూడా కొంతమంది అనుకుంటున్నారు. మరి ఇప్పుడు మాల్యా ఏం చేస్తాడో.. మరోసారి ఎలాంటి ఆఫర్ తో ముందుకొస్తాడో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu