నెల్లూరు తీరంలో టెన్షన్..టెన్షన్

వార్దా తుఫాను నెల్లూరు జిల్లా శ్రీహరికోట-చెన్నై మధ్య తీరం దాటనుండటంతో అధికార యంత్రాంగా అప్రమత్తమైంది. సముద్రతీర మండలాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాలో సహాయక చర్యల కోసం మూడు జాతీయ విపత్తు బృందాలను సిద్ధం చేశామని, అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉండగా, తీరం వెంట గాలి తీవ్రత పెరిగింది. తుఫాను తీరం దాటే సమయంలో సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu