దారి మళ్లిన ప్రధాని మోడీ హెలికాఫ్టర్..

ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను అధికారులు దారి మళ్లీంచారు. బీజేపీ నిర్వహిస్తున్న పరివర్తన్ యాత్రలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో ప్రధాని పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. ఇందుకోసం హెలికాఫ్టర్‌లో ఆయన అక్కడికి బయలుదేరారు. అయితే ర్యాలీ జరిగే ప్రాంతంలో దట్టమైన పొగమంచు కారణంగా హెలికాఫ్టర్‌ను కిందకు దించేందుకు ఏవియేషన్ అధికారులు అనుమతి నిరాకరించడంతో హెలికాఫ్టర్‌ను లక్నోకు మళ్లించారు.. అయితే, ప్రధాని మొబైల్ ఫోన్ ద్వారా ప్రసంగిస్తుండగా..ఆ ఫోన్‌ను సభలోని లౌడ్ స్పీకర్ల వద్ద ఉంచి ప్రజలకు వినిపిస్తున్నారు బీజేపీ నేతలు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu