బోల్డ్ విజయ రహస్యం అదేనట..
posted on Aug 29, 2016 12:06PM

జమైకా చిరుతగా పేరు తెచ్చుకున్న ఉస్సేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించి..ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఉస్సేన్ బోల్ట్ వియజ రహస్యం ఏంటో చెప్పారు బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్. ఉస్సేన్ బోల్ట్, చిన్నప్పటి నుంచి పేదరికం కారణంగా గొడ్డుమాంసం తినడానికి అలవాటు పడ్డాడని, ఆ అలవాటే అతను 9 ఒలింపిక్ స్వర్ణ పతకాలు సాధించేందుకు కారణమని వ్యాఖ్యానించారు. ఈ జమైకా లెజండ్ విజయాల వెనకున్న సీక్రెట్ ఇదేనని, అతని శిక్షకుడు సైతం రెండుపూటలా బీఫ్ తినమని సలహాలు ఇచ్చేవాడని చెప్పారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో తొలి పతకం నెగ్గిన బోల్ట్, తాజా రియో ఒలింపిక్స్ లో 9వ స్వర్ణాన్ని గెలిచి, తన కెరీర్ ను విజయవంతంగా ముగించాడు. అయితే ఇప్పుడు ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు.