మెదక్ లోక్‌సభ స్థానంలో టీఆర్ఎస్ గెలుపు

 

మెదక్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం సాధించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ నుంచి జగ్గారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి ఈ స్థానం నుంచి పోటీపడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి 2,67,900 మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలవగా, బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. కౌంటింగ్లో టీఆర్ఎస్ మొదటి నుంచీ ఆధిక్యం ప్రదర్శించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డిపాజిట్లు దక్కించుకోగలిగాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu