పాఠశాల భవనం కుప్పకూలి నలుగురు చిన్నారులు మృతి

రాజస్థాన్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల భవనం కుప్పకూలి నలుగురు విద్యార్థులు మరణించారు. ఈ దుర్ఘటన ఝలావర్ లో చోటు చేసుకుంది. శుక్రవారం (జులై 25) ఉదయం ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు అంతలోనే మృత్యువాత పడటంతో ఆ చిన్నారుల తల్లిదండ్రుల దుఖానికి అంతులేకుండా పోయింది.

ఝలావర్ లోని ప్రాథమిక పాఠశాల భవనం పై కప్పు ఈ ఉదయం పది గంటల సమయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు గాయపడగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద కొంతమంది విద్యార్థులు చిక్కుకున్నారన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. స్థానికులు, పోలీసులు, అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu