నిలకడగా తిరుపతి తొక్కిసలాట క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి

తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని   స్విమ్స్ సూపరింటెండెంట్ రవి కుమార్ వెల్లడించారు. క్షతగాత్రులందరికీ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులలో ఓ ముగ్గురు మాత్రం మూడు రోజుల అబ్జర్వేషన్లో ఉండాలన్నారు. 

మిగిలిన వారందరినీ త్వరలో డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. రుయా ఆస్పత్రి నుంచి స్విమ్స్ కు మొత్తం 13మందిని తరలించారు. వారందరికీ చికిత్స జరుుగతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్విమ్స్ కు వచ్చి  క్షతగాత్రులను పరామర్శించనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu