తెలంగాణలో ఈతచెట్లు.. 5 కోట్లు

 

తెలంగాణలో కల్తీ కల్లు తాగి చాలా మంది చనిపోతున్నారని సీఎం కేసీఆర్ చాలా బాధపడుతున్నట్టున్నారు అందుకే తెలంగాణ చెరువు కట్టల మీద ఐదు కోట్ల ఈతచెట్లను పెంచాలని ఆదేశించారట. ఈ బాధ్యతను ఎక్సైజ్ శాఖ తీసుకోవాలని ,ఈత నర్సరీలను తయారుచేయాలని ఆయన సూచించారట. తెలంగాణలో చాలా చోట్ల కల్తీ గుడుంబా వల్ల ప్రజలు చనిపోతున్నారని.. ఈ పరిస్థితిని అరికట్టాలని ఈయన అన్నారు. దీనిలో భాగంగానే మంచి కల్లు కోసం ఈత చెట్లను పెంచాలని.. కాయకష్టం చేసుకుని వచ్చిన శ్రామికులు విశ్రాంతి కోసం మద్యం తీసుకుంటారని అందువల్ల వారి ఆరోగ్యానికి నష్టం లేని విధంగా మంచి మద్యం అందించాలని కెసిఆర్ సూచించారట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu