టీఆర్ఎస్ ప్రభుత్వానికి మెంటల్

 

టీఆర్ఎస్ ప్రభుత్వానికి మెంటల్ ఎక్కిందని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘ఉస్మానియా ఆస్పత్రిలో 24 అంతస్తుల ట్విన్ టవర్లు కడతానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. ఆ ఆస్పత్రి భవనం హెరిటేజ్ బిల్డింగ్. ఈ కట్టడాన్ని కూలగొడతాననడం దారుణం. కేసీఆర్ కట్టాలని అనుకుంటున్న ఆ ట్విన్ టవర్లు చెస్ట్ ఆస్పత్రిలోనే కట్టొచ్చుగా? అనాలోచిత నిర్ణయాలకు సచివాలయంలోని సీ బ్లాకు నిలయంగా మారింది. మెంటలెక్కిన ప్రభుత్వం అంటే ఇదే. హైదరాబాద్‌లో కాలుష్యం పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో చెస్ట్ ఆస్పత్రి వుండాల్సిన అవసరం వుంది. ఆయుర్వేద ఆస్పత్రిని ఎర్రగడ్డ నుంచి తరలిస్తే ఉద్యమిస్తాం’’ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu