ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. తెలంగాణ డిప్యూటీ సీఎం


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ.. ఏపీ నేతలు, ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ ప్రజలే కాదు తెలంగాణకు సంబంధించిన వారు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలోని ఖాజా నాయబ్ రసూల్ దర్గాను దర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ తెలంగాణకు పెద్దన్నయ్య లాంటిది.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని అన్నారు. అంతేకాదు ఏపీతో పాటు తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనించాలని ప్రార్థించినట్టు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి ఏఎస్ పేట దర్గా అభివృద్ధికి కొన్ని నిధులను మంజూరు చేయిస్తామని వివరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu