టీ.అసెంబ్లీలో గదుల వివాదం..టీడీపీ గదులు ఇతరులకు

తెలంగాణ అసెంబ్లీలో గదుల కేటాయింపు వ్యవహారం రచ్చకు దారి తీసింది. తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షానికి చెందిన రూం నెం 107, 110 నెంబరు గదులను మహఇళా శిశు సంక్షేమశాఖ ఛైర్మన్ రేఖానాయక్, మైనారిటీ సంక్షేమశాఖ ఛైర్మన్ షకీల్‌కు కేటాయిస్తూ తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ఈ నెల 1న ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంపై టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. స్పీకర్ తమకు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తామని ఆయన అన్నారు.