మోడీ వేటు పడింది వీరిపైనే...

ప్రధాని నరేంద్రమోడీ తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. ఈ సందర్భంగా భారీ మార్పులు, చేర్పులు చేశారు. ఈ నేపథ్యంలో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికారు. సహాయ మంత్రులైన నిహాల్చంద్ (పంచాయతీరాజ్), రామ్ శంకర్ కటారియ (మానవ వనరుల అభివృద్ధి), సన్వర్ లాల్ (జలవనరులు), మోహన్ కుందారియా (వ్యవసాయం), మనుసుఖ్భాయ్ వాసవ్లను (గిరిజన వ్యవహారాలు) కేబినెట్ నుంచి తొలగించారు. కొందరికి పనితీరే కొలమానమైనప్పటికి..వ్యక్తిగత..రాజకీయ కారణాలు వేటు వేసేందుకు దోహదమయ్యాయి. పార్టీ భవిష్యత్తు, పాలనపై మరింత పట్టు సాధించేందుకు గానూ ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు.