సీమాంధ్ర పాలకులే కారణమంటున్న కేసీఆర్

తెలంగాణలో వ్యవసాయరంగం దెబ్బతినడానికి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి సమైక్య పాలనలో జరిగిన అన్యాయమేనని టీ సీఎం కేసీఆర్ అన్నారు, సీమాంధ్రుల పాలనలో తెలంగాణ నీటిపారుదల రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, అందుకే తామిప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతిస్తూ డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కష్టపడుతోందన్న ఆయన, దానికి అవసరమైన అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు, అయితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యవసాయాధికారులు సహకరించాలని, అప్పుడే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుతుందని అన్నారు. వ్యవసాయాధికారులు మరింత క్రియాశీలకంగా పనిచేయాలన్న కేసీఆర్.... ఏ సమయంలో ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో రైతులకు తెలియజేయాల్సిన అవసరముందని, అలాగే మైక్రో ఇరిగేషన్ ను కూడా ప్రోత్సహించాలని సూచించారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu