ముగ్గురు టీడీపీ నేతలను కిడ్నాప్ చేసిన మావోలు

ముగ్గురు టీడీపీ నేతలు కిడ్నాప్ కు గురైనట్టు తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లాలో మావోయిస్టులు ముగ్గురు టీడీపీ నేతలు జీకేవీధి టీడీపీ మండల అధ్యక్షుడు మండలి బాలయ్య, పార్టీ సీనియర్‌ నేత వండలం బాలయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్కల మహేష్‌లను కిడ్నాప్ చేశారు. నిన్న సాయంత్రం వీరి ముగ్గురిని మావోలు ఎత్తికెళ్లినట్టు తెలుస్తోంది. బాక్సైట్‌ తవ్వకాలను విరమించుకోవాలని లేకపోతే టీడీపీ నేతలను ముగ్గురిని ప్రజాకోర్టులో శిక్షిస్తామని ప్రత్యేక జోనల్‌ కమిటీ ఏవోబీ బార్డర్‌ హెచ్చరించింది. దీంతో తమ జీవితాలు ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉన్నాయని తమను రక్షించాలని మీడియాకు లేఖ రాశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu