వలస కార్మికుల పరిస్థితి ఏంటీ.. టీఎస్ సర్కార్ పై హైకోర్టు సీరియస్ 

బుధవారం నుంచి లాక్ డౌన్ పెట్టాలన్న తెలంగాణ సర్కార్ నిర్ణయంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు కనీసం వీకెండ్ లాక్ డౌన్ కూడా పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్కసారిగా రేపటి నుండి లాక్ డౌన్ అంటే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంత తక్కువ టైమ్‌లో ఎలా వారి ప్రాంతాలకు వెళతారని  ప్రశ్నించింది. గతేడాది వలస కార్మికులు ఇబ్బందులు పడినట్లు ఈ సారి ఇబ్బంది పడకుండా చూడాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రోజువారీ కూలి చేస్తూ బతికే వాళ్ళు వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించగా.. 50 శాతం వలస కార్మికులు వాళ్ళ వాళ్ళ సొంతూళ్లకు వెళ్లారని తెలిపారు. 

లాక్ డౌన్ వల్ల సాయంత్రపు వేళల్లో ఏమైనా సడలింపులు ఉన్నాయా అని ధర్మాసనం అడగగా, ఎలాంటి రిలాక్షేషన్స్ లేవని అడ్వకేట్ జనరల్ తెలిపారు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌పై పూర్తి వివరాలు తెలపడానికి హైకోర్టును అడ్వకేట్ జనరల్ మూడు రోజుల సమయం కోరారు. అప్పటి వరకు జనాలు ప్రాణాలు కోల్పోవాలా అని సీరియస్  అయ్యింది. మందుల రేట్లు, ప్రైవేట్ హాస్పిటల్ అధిక బిల్లులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ సమయంలో హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలని తామెలా ఆదేశాలిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రపంచమంతా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే హాస్పిటళ్లై చర్యలు తీసుకోమని తామెలా చెప్తామని అన్నాది. ఆర్టికల్ 14,19 1(డీ) ప్రకారం అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సులను నిలిపి వేసి ఉల్లంఘనకు ప్రభుత్వం పాల్పడిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.