అహ్మదాబాద్-లండన్ ఫ్లైట్ లో సాంకేతిక సమస్య.. టేకాఫ్ కు ముందే గుర్తించడంతో తప్పిన ముప్పు
posted on Jun 17, 2025 1:56PM

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా AI159 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే టేకాఫ్ కు ముందు ఈ సమస్యను గుర్తించడంతో పెను ముప్పు తప్పింది. ఈనెల 12న అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలి వందల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ప్రమాదం తరువాత ఎయిర్ ఇండియా విమానం ఆ రోట్లో నడపడానికి సిద్ధమైన తొలి ఫ్లైట్ ఇదే కావడం గమనార్హం. ఈ ఫ్లైట్ లో కూడా సాంకేతిక సమస్య తలెత్తడం ఆందోళన కలిగిస్తున్నది. మొత్తంగా గత కొద్ది రోజులుగా ఎయిర్ ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల విమాన సర్వీసులలో ఇలా సాంకేతిక సమస్యలు తలెత్తడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది.