టీడీపీ, వైసీపీ దోస్త్ మేరా దోస్తు..

 

ఏపీ పంచాయితీ ఎన్నికల వైసీపీ అధికార దుర్వినియోగం చేస్తుందని.. అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తుందన్న లేదు టీడీపీ నాయకులే మాపై దాడులు చేస్తున్నారని ఇరు పక్షాలు కత్తులు దూసుకుంటున్న విషయం తెలిసిందే.. మరికొన్ని చోట్ల అయితే ఏకంగా దాడులకు పాల్పడ్డారు ఇరువర్గాల నాయకులు ,కార్యకర్తలు..టీడీపీ, వైసీపీ  మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తుంటుంది. గ్రామాలలో సైతం ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది.

అయితే పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని కొన్ని చోట్ల వైరి వర్గీయులు శత్రుత్వాలకు ముగింపు పలుకుతూ...అభివృద్ధి అంటే విడి విడిగా చీలి కొట్టుకోవడం, చంపుకోవడం కాదు.. అందరూ ఒక్కటై సమస్యను పరిష్కరించుకోవం అనుకుంటున్నారు
ఆ గ్రామ ప్రజలు. ఉన్న ఊరు వాళ్ళ మధ్య గొడవలు ఉంటే వూరి అభివృద్ధి ఎలా అనుకున్నారు..అందుకే  పార్టీ పంథాలను వీడి ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటున్నారు. ఇరుపక్షాల నాయకులు ఒప్పందానికి వచ్చారు. ఈ ఘటనే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పంచాయతీలో చోటు చేసుకుంది.

ప్రత్తిపాడు పంచాయతీ సర్పంచ్ పదవిని వైసీపీ, టీడీపీలు పంచుకున్నాయి. మూడేళ్ల పాటు వైసీపీ మద్దతుదారుడు, రెండేళ్ల పాటు టీడీపీ మద్దతుదారుడు సర్పంచ్ గా ఉండేలా ఒప్పంద పత్రాలపై నేతలు సంతకం చేశారు. ఇది సాక్షాత్తు హోంమంత్రి సుచరిత  నియోజకవర్గం కావడంతో... ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ, ప్రజలు ఈ ఒప్పందాన్ని హర్షిస్తున్నారు. ఇలాంటి వాటివల్ల గ్రామాలు ప్రశాంతంగా ఉంటాయని చెపుతున్నారు.