టిడిపి మహానాడులో వారసుల ఎట్రాక్షన్

 

 

 TDP Mahanadu, Nara lokesh TDP Mahanadu, chandrababu TDP Mahanadu

 

 

టిడిపి పార్టీ నిర్వహిస్తున్న 32వ మహానాడులో పలువురు నేతల వారసులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనారోగ్యంతో గత కొన్నాళ్లుగా అమెరికాలో చికిత్స పొంది వచ్చిన దేవేందర్ గౌడ్, పార్టీకి దూరంగా చంద్రబాబు మీద కోపంతో ఉన్న హరికృష్ణలు మహానాడుకు వచ్చారు. ఇక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ మరో ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు రాకపోవడం చర్చకు తెరలేపింది. టీడీపీ నేతలు దివంగత పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరాం, ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడులు హాజరయ్యారు. ఇక దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేంద్ర గౌడ్, కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్, రమేష్ రాథోడ్ కుమారుడు నితీష్ రాథోడ్, దేవినేని కుమారుడు దేవినేని చంద్రశేఖర్, చింతకాయల అయ్యన్న పాత్రడి కుమారుడు విజయ్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దయాకర్ రెడ్డిల కుమారులు హల్ చల్ చేశారు. వీరిలో కొందరు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగనున్నవారుంటే మిగిలిన వారు తండ్రుల వారసత్వాల కోసం ఎదురు చూస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu