తమిళనాడు కొత్త సీఎం పన్నీరు సెల్వం.. పాత మంత్రులే వుంటారు..

 

తమిళనాడు కొత్త సీఎంగా అన్నాడీఎంకే కోశాధికారి, ఆ రాష్ట్ర ప్రజాపనుల శాఖామంత్రి ఒ.పన్నీర్ సెల్వం ఎంపికయ్యారు. ఆయన సోమవారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్ కె రోశయ్య నుంచి పన్నీరు సెల్వానికి ఆహ్వానం అందింది. తమిళనాడులో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని ఏఐఏడీఎంకే శాసనసభాపక్ష నేత పన్నీర్ సెల్వంకు ఆ రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆహ్వానం పంపారు. దీంతో, తమిళనాడులో సోమవారం కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష పడటంతో ఆమె ముఖ్యమంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోయారు. ఫలితంగా ఆమె స్థానంలో కొత్త వారసుడి ఎంపిక జయలలిత ఆదేశం మేరకు ఆదివారం రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఇందులో జయలలిత సూచన మేరకు.. తన వీరవిధేయుడు, మంత్రి పన్నీర్ సెల్వంను ఏడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.పన్నీరు సెల్వం మంత్రివర్గంలో కూడా జయ మంత్రివర్గంలోని మంత్రులే కొనసాగుతారని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu