చుండూరు కేసులో సుప్రీం కోర్టు స్టే

 

దళితుల ఊచకోతకు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా చుండూరు ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న 20 మంది, ఇతర నిందితులు 36 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు చుండూరు ఘటనలో మరణించినవారి బంధువులు సుప్రీం కోర్టును ఆశ్చయించారు. ఈ కేసు బుధవారం నాడు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. సుప్రీం కోర్టు ఈ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడంతోపాటు ఈ కేసులో నిందితులందరికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది.